Nallapati Ram: జగన్‌రెడ్డి మరోసారి రిగ్గింగ్ చేసి గెలవాలని చూస్తున్నారు

ABN , First Publish Date - 2023-09-13T14:42:53+05:30 IST

చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) కడిగిన ముత్యంలా బయటకు వస్తారని టీడీపీ నాయకులు నల్లపాటి రాము(Nallapati Ram) వ్యాఖ్యానించారు.

Nallapati Ram:  జగన్‌రెడ్డి  మరోసారి రిగ్గింగ్ చేసి గెలవాలని చూస్తున్నారు

రాజమండ్రి: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) కడిగిన ముత్యంలా బయటకు వస్తారని టీడీపీ నాయకులు నల్లపాటి రాము(Nallapati Ram) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి తెలుగుదేశం నాయకుల మనోభావాలను జగన్‌రెడ్డి దెబ్బతీశారు.చంద్రబాబును అరెస్ట్ చేసి రాబోయే ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలవాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ టీడీపీ శ్రేణులు తిప్పికొడతారు. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేసిన అధికారులపై ఖచ్చితంగా డిఫర్‌మేషన్ కేసులు వేస్తాం.ఆంధ్రప్రదేశ్‌లో సైకో ముఖ్యమంత్రి ఉన్నారని ప్రజలు గుర్తించాలి. ఆయనకు అంటిన అవినీతి మరక అందరికీ అంటించాలని చూస్తున్నాడు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఎక్కడా అవినీతి జరగలేదని నల్లపాటి రాము పేర్కొన్నారు.

Updated Date - 2023-09-13T14:42:53+05:30 IST