Share News

AP High Court: లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌కు ఊరట

ABN , First Publish Date - 2023-10-13T18:21:28+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh) సన్నిహితుడు కిలారు రాజేష్‌(Kilaru Rajesh)కు ఏపీ హైకోర్టు(AP High Court)లో ఊరట లభించింది.

AP High Court: లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌కు ఊరట

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh) సన్నిహితుడు కిలారు రాజేష్‌(Kilaru Rajesh)కు ఏపీ హైకోర్టు(AP High Court)లో ఊరట లభించింది. 160 సీఆర్‌పీసీ కింద కిలారు రాజేష్‌‌కు సోమవారం తమ ఎదుట హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు పంపిచారు. ఇప్పటికే కిలారు రాజేష్ ద్వారా లోకేష్‌కు స్కిల్ కేసులో డబ్బులు అందాయని సిఐడీ అధికారులు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కిలారు రాజేష్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ చేపట్టింది. కిలారు రాజేష్‌ను ఇప్పటివరకూ స్కిల్ కేసులో నిందితుడిగా చేర్చలేదని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ చేరిస్తే ఆయనకు సీఆర్‌పీసీలోని 41 ఏ కింద నోటీసులు ఇస్తామని సీఐడీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో కేసును హైకోర్టు డిస్పోజ్ చేసింది.

Updated Date - 2023-10-13T18:21:28+05:30 IST