NCBN Arrest: విశాఖ విమానాశ్రయంలో టీడీపీ నేత ఆడారి కిషోర్ వినూత్న నిరసన

ABN , First Publish Date - 2023-09-12T18:00:45+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్టుకు నిరసనగా విశాఖ విమానాశ్రయం(Visakhapatnam Airport)లో ఆ పార్టీ నేత ఆడారి కిషోర్ కుమార్(Adari Kishore Kumar) వినూత్న నిరసనకు దిగారు.

NCBN  Arrest: విశాఖ విమానాశ్రయంలో టీడీపీ నేత ఆడారి కిషోర్ వినూత్న నిరసన

విశాఖపట్నం: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్టుకు నిరసనగా విశాఖ విమానాశ్రయం(Visakhapatnam Airport)లో ఆ పార్టీ నేత ఆడారి కిషోర్ కుమార్(Adari Kishore Kumar) వినూత్న నిరసనకు దిగారు. విమానాశ్రయంలోని రన్వేపై పడుకుని నిరసన తెలిపారు.సేవ్ డెమోక్రసీ నినాదం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఏపీ గవర్నర్ కలగ చేసుకుని న్యాయం చేయాలని సేవ్ డెమోక్రసీ ఫ్లకార్డు ప్రదర్శించారు.దీంతో కిషోర్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిషన్ కర్షక దేవోభవ అవగాహన సదస్సులు ముగించుకుని హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం ఇండిగో విమానంలో కిషోర్ విశాఖ వచ్చారు. అదే సమయంలో గవర్నర్ నజీర్ విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే. కిషోర్ కుమార్ సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనకు పోలీసులు వెంటనే కిషోర్ కుమార్‌నూ అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2023-09-12T18:00:45+05:30 IST