AP NEWS: పుంగనూరు ఘటన చంద్రబాబు కనుసన్నల్లోనే..: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2023-08-05T14:28:40+05:30 IST

పుంగనూరు(Punganuru) ఘటనతెలుగుదేశం(Telugu Desham ) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కనుసన్నల్లోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.

AP NEWS: పుంగనూరు ఘటన చంద్రబాబు కనుసన్నల్లోనే..: మంత్రి బొత్స

విజయనగరం(Vizianagaram):పుంగనూరు(Punganuru) ఘటన తెలుగుదేశం(Telugu Desham ) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కనుసన్నల్లోనే జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు. పుంగనూరు ఘటనను ఖండించారు. శనివారం మంత్రి బోత్స మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy), ఆయన అనుచరులు రెచ్చగొడితే నీ బుద్ధి ఏమైందని చంద్రబాబుని ప్రశ్నించారు. ఎస్‌పీజీ రక్షణ(SPG protection) కలిగిన నేత ఎటు వెళ్తున్నారో ముందుగా చెప్పాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. పుంగనూరు ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. పుంగనూరు ఘటనకు కారణమైన చంద్రబాబుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Updated Date - 2023-08-05T14:37:33+05:30 IST