NTR Flexie : ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు పెట్టిందెవరో చెప్పేసిన ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2023-07-18T13:16:45+05:30 IST

ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు.

NTR Flexie : ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు పెట్టిందెవరో చెప్పేసిన ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: ఒంగోలులో పెద్ద ఎత్తున నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. తమ పార్టీ నేతలే ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్లెక్సీలు వేశారని.. తమ పార్టీ వారికి ఏ పని సరిగా చేయడం రాదంటూ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు వేస్తే అందులో హరికృష్ణ ఫోటో ఉండేదన్నారు. లోకేష్ మీటింగ్ ప్రకాశంలో ఉంటే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వైసీపీ వాళ్లే పెట్టారని తెలిపారు. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అమ్మఒడి సగం మంది పిల్లలకు ఇంకా రాలేదని.. పిల్లలు మామయ్య నొక్కేసిన డబ్బులు ఇంకా రాలేదు అని అంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఫోటోలు వేసుకుంటున్నారని మండిపడ్డారు.మద్యం అమ్మకాలు తగ్గాయని... కానీ ఆదాయం పెరిగిందన్నారు. దొంగ సప్లయ్ చేస్తున్నారని.. అమ్మకాలు తగ్గలేదని తెలిపారు. ఈ ప్రభుత్వం పోవటం ఖాయమని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-07-18T14:02:55+05:30 IST