Home » NTR District
Unseasonal Rains Damage: అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. చేతికొచ్చిన పంట నేలరాలడంతో అన్నదాతల బాధ వర్ణణాతీతం. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్న పరిస్థితి.
CM Chandrababu: సమాజంలో అందరికీ అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పారు. దేశంలో ఉన్న ఏ వ్యక్తీ పేదరికంలో ఉండకూడదని అన్నారు. దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు.
Tiruvuru Politics: తిరువూరులో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను పోటాపోటీగా నిర్వహించేందుకు పూనుకున్నారు కూటమి శ్రేణులు. ఎమ్మెల్యే, ఆర్గానిక్ ప్రొడక్షన్ చైర్మన్ ఇరువురి ఆధ్వర్యంలో జయంతి వేడుకలకు పిలుపునిచ్చారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నాడు బిజీబిజీగా ఉండనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది.
తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసుల భారీగా మోహరించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్ టీడీపీలో హిట్ పుట్టిస్తోంది. మాజీ ఏఎంసీ చైర్మన్ రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం కొలికపూడి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటలకు కొలికపూడి డెడ్ లైన్ పూర్తి అయింది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ఇప్పటికే అనేక ఆరోపణలతో వివాదాస్పదమైన ఆయన.. అలవాల రమేష్ రెడ్డిపై విమర్శలు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై గిరిజన యువకులు, మహిళలు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రమేష్ రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు తిరుణాలలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అడ్డుకున్న పోలీసు సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ దాడి ఘటనకు కారణమైన వారందరిపై కేసులు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు హోంమంత్రి ఆదేశించారు.
పెనుగంచిప్రోలులక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాలలో తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోయి కవ్వింపు చర్యలకు దిగారు. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా గాయపడ్డారు.
NTPS Accident: ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్టీపీఎస్లోఈ ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరోకార్మికుడి పరిస్థితి సీరియస్గా ఉంది. ఈఘటనతో ఫ్యాక్టరీలోని కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Andhrapradesh: ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ పోలీసులనే ఖంగుతినేలా చేసింది. ఆ ఇంట్లో దొంగతనం చేసే సమయంలో దొంగల ప్రవర్తించిన తీరుపై ఆశ్చర్యపోయారు పోలీసులు.