Share News

Deepfake Video: 'యానిమల్' మూవీలోని క్యారెక్టర్స్‌లో ముంబై ఇండియన్ ప్లేయర్స్.. నెట్టింట వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-12-10T12:46:33+05:30 IST

Mumbai Indians Players As Animal Movie Characters: ఈ మధ్యలో డీఫేక్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వీటిలో సెలబ్రిటీల ముఖాలను ఎడిట్ చేసి పెట్టడంతో ఇలాంటి వీడియోలు నెట్టింట చాలా ఈజీగా వైరల్ అవుతున్నాయి. ఇదే కోవలో తాజాగా సామాజిక మాధ్యమాల్లో మరో డీఫేక్ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Deepfake Video: 'యానిమల్' మూవీలోని క్యారెక్టర్స్‌లో ముంబై ఇండియన్ ప్లేయర్స్.. నెట్టింట వీడియో వైరల్!

Mumbai Indians Players As Animal Movie Characters: ఈ మధ్యలో డీఫేక్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వీటిలో సెలబ్రిటీల ముఖాలను ఎడిట్ చేసి పెట్టడంతో ఇలాంటి వీడియోలు నెట్టింట చాలా ఈజీగా వైరల్ అవుతున్నాయి. ఇదే కోవలో తాజాగా సామాజిక మాధ్యమాల్లో మరో డీఫేక్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇటీవల విడుదలైన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'యానిమల్' (Animal Movie) లోని క్యారెక్టర్లలో ముంబై ఇండియన్ ప్లేయర్ల ముఖాలతో ఎడిట్ చేశారు. సచిన్ టెండూల్కర్ మొదలుకొని ఇషాన్ కిషన్ వరకు పలువురిని చాలా చక్కగా హీరో రణబీర్ కపూర్ క్యారెక్టర్‌కు జోడించారు. వీడియో మొదలు కావడమే కెప్టెన్ రోహిత్ శర్మ కనిపిస్తాడు. చివరికి విలన్ బాబీ డియోల్ క్యారెక్టర్‌లో సచిన్ దర్శనిమిస్తాడు. మధ్యలో ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ కనిపిస్తారు.

ఇది కూడా చదవండి: Viral Video: విద్యార్థినిలతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన టీచర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

సినిమాలో పలు కీలక సీన్లలో రణబీర్ కనిపించే క్యారెక్టర్‌కు ఈ ముంబై ప్లేయర్ల (Mumbai Indians Players) ముఖాలను పెట్టడం బాగుంది. మధ్యలో ఒక సీన్ వద్ద భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కూడా కనిపిస్తారు. ఇక చివరగా వచ్చే సీన్ అయితే ఈ వీడియోకే హైలైట్ అని చెప్పొచ్చు. ప్రతినాయకుడు బాబీ డియోల్ క్యారెక్టర్‌లో లిటిల్ మాస్టర్ సచిన్ ఎంట్రీ అదిరిపోయిందంతే. సూర్య భాయ్ కూడా ఒక సీన్‌లో చాలా చక్కగా సరిపోయాడు. 'ఏంఐ' పేరిట క్రియేట్ చేసిన ఈ వీడియోను స్వయంగా రణబీర్ కపూర్ తన 'ఎక్స్' (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Tomato: అంతరిక్షంలో కనిపించకుండాపోయిన టమాటా.. 8 నెలల తర్వాత దొరికింది.. అసలేం జరిగిందంటే..!

38 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక 'యానిమాల్' మూవీ విషయానికి వస్తే.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ.600కోట్లకు పైగా రాబట్టింది. ఈ వీకెండ్‌లో భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్‌'లో రణబీర్ కపూర్, రష్మిక మందాన హీరోహీరోయిన్లుగా నటించగా.. బాబీ డియోల్ విలన్‌గా కనిపించారు.

Updated Date - 2023-12-13T13:04:34+05:30 IST