Bride: రైల్లో ఓ కొత్త జంట జర్నీ.. బాత్రూంకు వెళ్లిన వధువు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆ వరుడికి డౌట్.. రైలంతా వెతికితే..!

ABN , First Publish Date - 2023-08-04T15:33:27+05:30 IST

వారిద్దరికీ కొన్ని నెలల క్రితమే వివాహమైంది. అందరిలాగే వీరు కూడా హనీమూన్ వెళ్లేందుకు వివిధ రకాల ప్రాంతాలను ఎంచుకున్నారు. చివరకు ఓ అందమైన ప్రాంతాన్ని ఎంచుకుని ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నారు. రైల్లో ఏసీ కోచ్‌లో సీట్లు బుక్ చేసుకున్న అతను.. భార్యతో కలిసి ...

Bride: రైల్లో ఓ కొత్త జంట జర్నీ.. బాత్రూంకు వెళ్లిన వధువు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆ వరుడికి డౌట్.. రైలంతా వెతికితే..!
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరికీ కొన్ని నెలల క్రితమే వివాహమైంది. అందరిలాగే వీరు కూడా హనీమూన్ వెళ్లేందుకు వివిధ రకాల ప్రాంతాలను ఎంచుకున్నారు. చివరకు ఓ అందమైన ప్రాంతాన్ని ఎంచుకుని ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నారు. రైల్లో ఏసీ కోచ్‌లో సీట్లు బుక్ చేసుకున్న అతను.. భార్యతో కలిసి సరదా కబుర్లు చెబుతూ సంతోషంగా ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రైల్లో బాత్రూంకు వెళ్లిన వధువు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆ వరుడికి డౌట్ వచ్చింది. రైలంతా వెతికినా ఆమె కనిపించలేదు. చివరకు ఏం జరిగిందంటే..

బీహార్ ముజఫర్‌పూర్‌లోని (Bihar Muzaffarpur) కుధాని పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతానికి చెందిన ప్రిన్స్ కుమార్ అనే వ్యక్తికి.. మధుబనిలోని జయనగర్ ప్రాంతానికి చెందిన కాజల్ అనే యువతితో (young woman) ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం (marriage) జరిగింది. ప్రిన్స్ విద్యుత్ శాఖలో పని చేస్తుంటాడు. ఇతను తన భార్యను తీసుకుని హనీమూన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే వివిధ కారణాలతో అది సాధ్యం కాలేదు. ఈ దంపతులు వివాహమైనప్పటి నుంచి ఎంతో సంతోషంగా ఉండేవారు. ఈమెకు అత్తగారి ఇంట్లో కూడా ఎలాంటి సమస్యలూ లేవు. ఇటీవల ప్రిన్స్ కుమార్ తన ఉద్యోగానికి సెలవు పెట్టి.. భార్యతో కలిసి డార్జిలింగ్ (Darjeeling) వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. గురువారం సాయంత్రం దంపతులిద్దరూ లగేజీ సర్దుకుని ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు.

Shocking: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో భర్త.. మెడికల్ టెస్టులు చేసి.. భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు కథేంటంటే..!

23.jpg

అక్కడి నుంచి న్యూ జల్‌పైగురికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. ఏసీ కోచ్‌లో (AC Coach) భార్యతో కలిసి సరదా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు. ఇంతలో కిషన్‌గంజ్‌లో రైలు ఆగింది. ఆ సమయంలో ప్రిన్స్ భార్య.. టాయిలెట్‌కు వెళ్లింది. వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగిరాలేదు. దీంతో అనుమానం వచ్చి కోచ్ మొత్తం వెతికాడు. అయినా ఆమె ఎక్కడా కనిపించలేదు. చివరకు టీసీకి విషయం తెలియజేశాడు. అనంతరం కిషన్‌గంజ్ స్టేషన్‌లో భార్య అదృశ్యంపై ఫిర్యాదు చేశాడు. వారు సీసీ కెమెరాలు (CC cameras) పరిశీలించినా ఆమె ఎక్కడా కనిపించలేదు. ప్రిన్స్ మాట్లాడుతూ తన భార్యకు ఎవరితోనూ ఎలాంటి సంబంధం లేదని, ప్రేమ వ్యవహారాలు కూడా లేవని చెప్పాడు. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Marriage: పెళ్లి వేడుకలోనే వరుడిని చితకబాదిన వధువు.. బంధువులంతా చూస్తుండగానే కింద పడేసి..!

Updated Date - 2023-08-04T15:33:27+05:30 IST