Dilip Achari: రేవంత్ ఆ టికెట్ అమ్ముకున్నారు

ABN , First Publish Date - 2023-10-11T20:00:40+05:30 IST

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) 12 కోట్లకు అమ్ముకున్నారని బీజేపీ నాగర్ కర్నూల్ ఇన్‌చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి(Dilip Achari) ఆరోపించారు.

Dilip Achari: రేవంత్ ఆ టికెట్ అమ్ముకున్నారు

నాగర్ కర్నూలు: నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) 12 కోట్లకు అమ్ముకున్నారని బీజేపీ నాగర్ కర్నూల్ ఇన్‌చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి(Dilip Achari) ఆరోపించారు. బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి నార్సింగ్‌లోని రాజపుష్ప అపార్ట్‌మెంట్లో నాలుగు ప్లాట్లను రేవంత్ బినామీలకు రిజిస్ట్రేషన్ చేశారు. టికెట్లు అమ్ముకోలేదని నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి నల్లమట్టి దొంగ అని.. నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు ఆయనను తిరస్కరిస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డిని ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడిస్తారు’’ అని దిలీప్ ఆచారి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-11T20:00:40+05:30 IST