Share News

CM Chandrababu: ప్రొ. జయసింహులు మృతికి సీఎం సంతాపం

ABN , Publish Date - Jul 10 , 2024 | 03:51 PM

సీనియర్ విద్యావేత్త, వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ వి. జయసింహులు నాయుడు మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) సంతాపం వ్యక్తం చేశారు.

CM Chandrababu: ప్రొ. జయసింహులు మృతికి సీఎం సంతాపం
CM Chandrababu

అమరావతి: సీనియర్ విద్యావేత్త, వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ వి. జయసింహులు నాయుడు మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. చదువుకునే రోజుల్లో ప్రొఫెసర్ జయసింహులు తన సహచర విద్యార్థి, స్నేహితుడని తెలిపారు. వేలాదిమంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంతో పాటు తన రచనల ద్వారా ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. జయసింహులు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - Jul 10 , 2024 | 03:52 PM