Share News

Bhuvaneswari: నేడు చిత్తూరులో భువనమ్మ ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తారంటే?

ABN , Publish Date - Feb 23 , 2024 | 09:35 AM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జిల్లా పర్యటన కొనసాగుతోంది. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వరుసగా మూడవ రోజు భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు.

Bhuvaneswari: నేడు చిత్తూరులో భువనమ్మ ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తారంటే?

చిత్తూరు, ఫిబ్రవరి 23: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) జిల్లా పర్యటన కొనసాగుతోంది. ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వరుసగా మూడవ రోజు భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌‌తో మనస్థాపంతో మృతిచెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ ఆర్థిక సాయం అందజేస్తున్నారు.

ఈరోజు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు చిత్తూరు టౌన్ మురుకుంబట్టు బైపాస్ వద్ద విడిది కేంద్రం నుంచి భువనేశ్వరి పర్యటన ప్రారంభంకానుంది. ఉదయం 10:45 గంటలకు చిత్తూరు నియోజకవర్గం, చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు. 11:45 జీడీ నెల్లూరు నియోజకవర్గం, ఎస్.ఆర్.పురం మండలం, గంగమ్మగుడి గ్రామంలో టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించి ఆర్థిక సాయం అందజేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 1:15 గంటలకు సత్యవేడు నియోజకవర్గం, నారాయణవనం మండలం, తంబూరు గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆపై 3:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి భువనేశ్వరి హైదరాబాద్‌కు తిరుగు పయనంకానున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 23 , 2024 | 09:53 AM