Share News

AP Politics: బొత్సపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత

ABN , Publish Date - Jun 07 , 2024 | 06:24 PM

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలువురు ఉపాధ్యాయుల వద్ద వేల కోట్ల రూపాయలు వసూల్ చేశారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు గండి బాబ్జి (Gandi Babji) సంచలన ఆరోపణలు చేశారు. టీచర్లను వారు కోరుకున్న ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని మాయ మాటలు చెప్పి బొత్స వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

AP Politics: బొత్సపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత

విశాఖపట్నం: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలువురు ఉపాధ్యాయుల వద్ద వేల కోట్ల రూపాయలు వసూల్ చేశారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు గండి బాబ్జి (Gandi Babji) సంచలన ఆరోపణలు చేశారు. టీచర్లను వారు కోరుకున్న ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని మాయ మాటలు చెప్పి బొత్స వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. బొత్స ఒక్క డాన్ లాంటి వారని ఆరోపణలు చేశారు.


వైసీపీ అధినేత జగన్ పక్కన ఉండి , మంత్రి పదవి తీసుకొని రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి టీచర్ల వద్ద డబ్బు వసులు చేసిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విశాఖ ప్రజలు కబ్జా కోరుల నుంచి రాష్ట్రాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కాపాడారని తెలిపారు. బొత్స ఝాన్సీని విశాఖలో పెత్తనం కోసమే పోటీలో పెట్టారన్నారు. కూటమి ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.


బొత్సపై విచారణ వేసి చట్టపర్య మైన చర్యలు తీసుకుంటాం: పల్లా శ్రీనివాస్

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం చరిత్రలో నిలిచిపోతుందని తెలుగుదేశం పార్టీ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) పేర్కొన్నారు. తమపై బాధ్యత ప్రజలు పెట్టారన్నారు. విద్యా శాఖలో జరిగిన అవీనీతి ఎన్నికల ముందు తమ దృష్టికి వచ్చాయన్నారు. ఈ విషయంలో మాజీ మంత్రి బొత్స పై విచారణ వేసి చట్టపర్య మైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బొత్స వీటి పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులు కోసమే బొత్స అధికారాన్ని వాడుకున్నారని పల్లా శ్రీనివాస్ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: టీచర్ల బదిలీపై బొత్స రియాక్షన్.. అసలు కారణమిదేనట..!

Andhra Pradesh: ఏపీ సీఎంఓలో కీలక పరిణామం.. ఆ ముగ్గురిపై వేటు..

Pawan Kalyan: మోదీజీ.. మేమంతా మీ వెనుక ఉన్నాం

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 07 , 2024 | 06:29 PM