Share News

Crime News: మచిలీపట్నంలో దారుణం.. బాలికపై అత్యాచారం..

ABN , Publish Date - Sep 14 , 2024 | 07:32 PM

మచిలీపట్నంలో పవన్ కుమార్ అనే యువకుడు ఓ బాలిక(15)పై అత్యాచారం చేశాడు. కొన్ని రోజులుగా చిన్నారి వెంట పడుతున్న కామాంధుడు ఆమె కదలికలపై నిఘా పెట్టి దారుణానికి ఒడికట్టాడు.

Crime News: మచిలీపట్నంలో దారుణం.. బాలికపై అత్యాచారం..

కృష్ణాజిల్లా: మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. అలాగే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే నిందితులపై ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధుల్లో మాత్రం భయం కలగడం లేదు. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఓ మూలన లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.


తాజాగా మచిలీపట్నంలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. పట్టణానికి చెందిన పవన్ కుమార్ అనే యువకుడు ఓ బాలిక(15)పై అత్యాచారం చేశాడు. కొన్ని రోజులుగా చిన్నారి వెంట పడుతున్న కామాంధుడు ఆమె కదలికలపై నిఘా పెట్టాడు. శుక్రవారం రాత్రి 8:30గంటలకు ఒంటరిగా వస్తున్న విషయం తెలుసుకుని దాడికి పాల్పడ్డాడు. బలవంతంగా ద్విచక్రవాహనం ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై అత్యాచారానికి ఒడికట్టాడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయాడు. ఘటన గురించి బాధిత చిన్నారి కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో హుటాహుటిన వారంతా పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ అబ్దుల్ నబీ తెలిపారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Updated Date - Sep 14 , 2024 | 07:33 PM