Share News

Manickam Tagore: 2024 ఏపీ కాంగ్రెస్‌కు మంచి టర్నింగ్‌గా మారనుంది

ABN , Publish Date - Jan 10 , 2024 | 08:56 PM

2024లో ఏపీ కాంగ్రెస్‌ ( AP Congress ) కు మంచి టర్నింగ్‌గా మారనుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్ ( Manickam Tagore ) అన్నారు. బుధవారం నాడు విజయవాడలో పర్యటించారు.

Manickam Tagore: 2024 ఏపీ కాంగ్రెస్‌కు మంచి టర్నింగ్‌గా మారనుంది

విజయవాడ: 2024లో ఏపీ కాంగ్రెస్‌ ( AP Congress ) కు మంచి టర్నింగ్‌గా మారనుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్ ( Manickam Tagore ) అన్నారు. బుధవారం నాడు విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా మాణిక్కం ఠాకూర్ మాట్లాడుతూ... ఇన్‌చార్జిగా తన మొదటి విజిట్ ఇదని చెప్పారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఏపీ ప్రజలకు తెలుపుతామని చెప్పారు. ఎక్కువ మంది ఎంపీలు ఉండటంతో వైసీపీ బీజేపీకి బీ టీంగా ఉంది. మోదీ ప్రభుత్వంలో ఏపీకి ఒక్క మెట్రో కూడా రాలేదు. షర్మిల కాంగ్రెస్‌లో చేరారు‌.. షర్మిలకు కాంగ్రెస్ ఎంత బాగా చూసుకుంటుందో తెలుసునని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం రాజశేఖర్‌రెడ్డి కల అని అందుకోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. చాలామంది కాంగ్రెస్‌లో చేరారు... ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఈరోజే కాంగ్రెస్‌లో చేరారు...ఈనెలలో మరిన్ని చేరికలు ఉంటాయని మాణిక్కం ఠాకూర్ పేర్కొన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 08:56 PM