Share News

AP News: విజయవాడలో హైటెన్షన్.. వల్లభనేని వంశీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

ABN , Publish Date - Jun 07 , 2024 | 07:08 PM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వంశీ నివాసం వద్ద టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు ఆందోళన చేపట్టారు. వంశీకి చెందిన వాహనాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీసు బలగాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు.

AP News: విజయవాడలో హైటెన్షన్.. వల్లభనేని వంశీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
vallabanenivamsi

విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వంశీ నివాసం వద్ద టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు ఆందోళన చేపట్టారు. వంశీకి చెందిన వాహనాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీసు బలగాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో కార్యకర్తలు పరారయ్యారు.


మళ్లీ వస్తాం ‌వంశీ నీ..సంగతి తేలుస్తాం అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. వంశీ కార్యాలయం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. అలాగే వంశీ కార్యాలయం దగ్గర కూడా టీడీపీ శ్రేణులు దాడి చేస్తారనే సమాచారంతో ముందస్తు చర్యలు చేపట్టారు. వంశీ కార్యాలయంలో కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను వేరే చోటికి ఆయన అనుచరులు తరలించారు. ఖాళీ అయిన కార్యాలయాన్ని వంశీ ఆస్పత్రికి లీజుకు ఇచ్చినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: టీచర్ల బదిలీపై బొత్స రియాక్షన్.. అసలు కారణమిదేనట..!

Andhra Pradesh: ఏపీ సీఎంఓలో కీలక పరిణామం.. ఆ ముగ్గురిపై వేటు..

Pawan Kalyan: మోదీజీ.. మేమంతా మీ వెనుక ఉన్నాం

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 07 , 2024 | 07:10 PM