Share News

Kotamreddy Sridhar Reddy: చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కోటంరెడ్డి..

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:32 AM

నెల్లూరులో మార్చి నెల 2వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉండనుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వీపీఆర్ కన్వెన్షన్‌లో ఏర్పాట్లని టీడీపీ నేతలు పరిశీలించారు. మార్చి 2వ తేదీన నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారన్నారు.

Kotamreddy Sridhar Reddy: చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కోటంరెడ్డి..

నెల్లూరు: నెల్లూరులో మార్చి నెల 2వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటన ఉండనుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) తెలిపారు. వీపీఆర్ కన్వెన్షన్‌లో ఏర్పాట్లని టీడీపీ (TDP) నేతలు పరిశీలించారు. మార్చి 2వ తేదీన నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారన్నారు. వీపీఆర్ కన్వెన్షన్‌లో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు భారీ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. చంద్రబాబు సమక్షంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది (Vemireddy Prabhakar reddy), ఆయన సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్ ప్రశాంతి రెడ్ది టీడీపీలో చేరనున్నారని వెల్లడించారు. వీపీఆర్ దంపతులతో పాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్పొరేటర్లు, వైసీపీ (YCP) నేతలు భారీగా టీడీపీలో చేరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 11:33 AM