Share News

Minister Anam: పండుగ పూర్తయ్యే వరకూ సెలవుల్లేవ్

ABN , Publish Date - Jun 26 , 2024 | 08:48 PM

అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. రొట్టెల పండుగ సమయంలో అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Minister Anam: పండుగ పూర్తయ్యే వరకూ సెలవుల్లేవ్
Anam Ramanarayana Reddy

నెల్లూరు: అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. రొట్టెల పండుగ సమయంలో అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సెలవులో ఉన్న అధికారులు కూడా రావాలని కోరారు. పండుగ పూర్తయ్యే వరకూ ఎవరికి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. చెరువు వద్ద ఏర్పాట్లు బాగుండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా అందరూ పని చేయాలన్నారు. పోలీసులు ఎక్కువ చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని కోరారు.


ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య శాఖ చాలా కీలకంగా పని చేయాలన్నారు. వైద్యులు, హెల్త్ వర్కర్లను రొట్టెల పండుగ కోసం కేటాయించాని ఆదేశించారు. రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫైర్ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 26 , 2024 | 08:48 PM