Home » Anam Ramanarayana Reddy
వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాలను పట్టించుకోలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈసారి సింహాచలం చందనోత్సవం కార్యక్రమాన్ని చిన్న పొరపాటూ జరగకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.
Anam Ramanarayana Reddy: ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్పై వైసీపీ నేతలు పేపర్లు చించి వేసి అగౌరవపరిచారని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పారు. జగన్ స్వతహాగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హితవు పలికారు.
మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సామాన్య దర్శనంతో పాటు రూ. 200, 500 రూపాయల ప్రత్యేక దర్శనాలను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం రెండు గంటల సమయం పడుతోంది.
Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
Maha Sivaraththiri: శ్రీకాళహస్తిలో కొలువు తీరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం జరగనున్నాయి. ఇవి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
Minister Anam Ramanarayana Reddy : ఏపీలో పలు ఆలయాల పుననిర్మాణానికి నిధుల కేటాయింపులు జరుగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. చరిత్ర, పవిత్రతను భవిష్యత్తు తరాలకు అందిస్తామని చెప్పారు. అందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వానికి భక్తులూ అండగా ఉన్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
Minister Anam Ramanarayana Reddy: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమృతధార పథకంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్లు సరిగా లేవని అధికారులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటన బాధాకరమన్నారు. విషయం తెలిసిన వెంటనే తనతో పాటు సహచర మంత్రులందరం కలిసి తిరుపతి చేరుకుని మృతుల కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూశామన్నారు. మృతుల్లో నలుగురు ఏపీ, ఒకరు తమిళనాడు, మరొకరు కేరళాకు చెందినవారు ఉన్నారని తెలిపారు.
అమరావతి: తిరుపతి ఘటనపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి ఆనం అమరావతి నుంచి మృతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు హుటాహుటీన తిరుపతికి చేరుకున్నారు.
Andhrapradesh: నూతన సంవత్సరంలో పోలవరం పూర్తి చేసుకుంటామని, జలహారం.. సాగరమాల పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలని ప్రజలు పూజలు చేయాలని కోరారు.