Share News

రాష్ట్రంపై భారం లేకుండా పోలవరాన్ని పూర్తి చేయాలి: షర్మిల

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:58 AM

కేంద్రం నుంచి నిధులు రప్పించి, రాష్ట్రంపై ఆర్థికభారం లేకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంపై భారం లేకుండా పోలవరాన్ని పూర్తి చేయాలి: షర్మిల

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి నిధులు రప్పించి, రాష్ట్రంపై ఆర్థికభారం లేకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. శనివారం ఆమె ఎక్స్‌లో స్పందించారు. ‘పోలవరం నిర్మాణానికి ఐదేళ్లు పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పోలవరం విధ్వంసానికి బీజేపీ, టీడీపీ, వైసీపీలే కారణం. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో జగన్‌ అంచనా వ్యయం పెంచాడే తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ప్రాజెక్టు నిర్మాణం ఉంది’ అని షర్మిల అన్నారు.

Updated Date - Jun 30 , 2024 | 05:58 AM