Share News

AP News: ప్రజలకు సీఎం జగన్ ఏం సందేశం ఇస్తున్నారు?: ఆలపాటి

ABN , Publish Date - May 10 , 2024 | 02:42 PM

Andhrapradesh: సమాజంలో అందరూ రూల్ ఆఫ్ లా పాటించాలని సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ మార్చిందని... మద్యం డిస్టలరీస్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. దీంతో పిచ్చి పిచ్చి బ్రాండ్‌లు తయారు చేస్తున్నారని..

AP News: ప్రజలకు సీఎం జగన్ ఏం సందేశం ఇస్తున్నారు?: ఆలపాటి
Senior Journalist Alapati Suresh

విజయవాడ, మే 10: సమాజంలో అందరూ రూల్ ఆఫ్ లా పాటించాలని సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ (Senior Journalist Alapati Suresh) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ మార్చిందని... మద్యం డిస్టలరీస్‌ను ప్రభుత్వమే (AP Govt) నిర్వహిస్తుందన్నారు. దీంతో పిచ్చి పిచ్చి బ్రాండ్‌లు తయారు చేస్తున్నారని.. దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయని మండిపడ్డారు.

Kejriwal Bail: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..


రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు పెరిగాయన్నారు. పోస్ట్ పెట్టినందుకు రంగనాయకమ్మపై సీఐడీ కేసు నమోదు చేసి విచారణ చేశారన్నారు. హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు సీఎంతో తిరుగుతున్నారని.. ప్రజలకు సీఎం జగన్ (CM Jagan) ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. తప్పు చేసినా ఏం కాదని నేరస్తులు భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనారోగ్యకరమైన వాతావరణం ఉందని.. దీన్ని అందరం కలిసి వ్యతిరేకించాలని ఆలపాటి సురేష్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

Kejriwal Bail: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..

Chandrababu: పచ్చి మోసగాడు ఈ జలగ.. రంగుల పిచ్చోడు ఇళ్లు కట్టించాడా?

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2024 | 03:04 PM