Share News

YS Sharmila: నేడు కడపలో షర్మిల ప్రచారం.. మెయిన్ టార్గెట్ జగన్, అవినాశ్‌లేనా?

ABN , Publish Date - Apr 05 , 2024 | 08:06 AM

నేటి నుంచి బస్సుయాత్ర ద్వారా ఏపీ పీసీసీ ఛీఫ్ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్ధి షర్మిలా రెడ్డి ప్రచారం ప్రారంభించనున్నారు. కడప పార్లమెంటు పరిధిలోఎంపీ అబ్యర్థిగా ప్రచారంలో పాల్గొననున్నారు. మొదటి రోజైన నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

YS Sharmila: నేడు కడపలో షర్మిల ప్రచారం.. మెయిన్ టార్గెట్ జగన్, అవినాశ్‌లేనా?

కడప: నేటి నుంచి బస్సుయాత్ర ద్వారా ఏపీ పీసీసీ ఛీఫ్ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్ధి షర్మిలా రెడ్డి (YS Sharmila) ప్రచారం ప్రారంభించనున్నారు. కడప పార్లమెంటు పరిధిలోఎంపీ అబ్యర్థిగా ప్రచారంలో పాల్గొననున్నారు. మొదటి రోజైన నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో చిన్నాన్న వైఎస్ వివేకా హత్యను అస్త్రంగా షర్మిల చేసుకుంటారని టాక్. అలాగే ఆమె మెయిన్ టార్గెట్ సీఎం జగన్, వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిలు కావడంతో ఆమె ప్రసంగం ఎలా ఉండబోతోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Srisailam: శ్రీశైలంలో రేపటి నుంచి ఉగాది ఉత్సవాలు

కడప ఎంపీగా బరిలోకి దిగుతున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి గురువారం ఎక్స్‌ వేదికగా తాను ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను. మీ రాజన్న బిడ్డను దీవించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నా’ అని షర్మిల పేర్కొన్నారు. కాగా, నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచార బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.

వలంటీర్లు నా సైన్యం!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 08:06 AM