Share News

Tamil Nadu BJP: తమిళిసైతో అన్నామలై భేటీ

ABN , Publish Date - Jun 14 , 2024 | 08:47 PM

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సైతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమావేశమయ్యారు. శుక్రవారం చెన్నైలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై.. ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం అన్నామలై ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళిసైతో భేటీ కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

Tamil Nadu BJP: తమిళిసైతో అన్నామలై భేటీ

చెన్నై, జూన్ 14: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సైతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమావేశమయ్యారు. శుక్రవారం చెన్నైలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై.. ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం అన్నామలై ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళిసైతో భేటీ కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పార్టీలోని సీనియర్ నేతల్లో ఆమె ఒకరని పేర్కొన్నారు. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కూడా తమిళిసై పని చేశారని వివరించారు. ఆమె రాజకీయ అనుభవంతోపాటు సలహాలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయని అన్నామలై ఆకాంక్షించారు. తాజాగా వీరిద్దరి భేటీతో ఇన్నాళ్లుగా నలుగుతున్న ఈ వివాదం కాస్తా సద్దుమణిగినట్లు అయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. తమిళనాడులో బీజేపీ చాలా తక్కువ సీట్లు గెలుచుకుంది. పార్టీ ఓటమికి అన్నామలై కారణమంటూ తమిళిసై ఆరోపణలు గుప్పించారు.


మరోవైపు జూన్ 12వ తేదీన గన్నవరం సమీపంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తమిళిసై తదితరులు హజరయ్యారు. ఆ సమయంలో తమిళిసైపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడినట్లు ఫొటోలతోపాటు వార్తలు సైతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా తనకు సలహాలు, సూచనలు చేశారంటూ తమిళిసై ఎక్స్ వేదికగా గురువారం స్పందించారు. ఆ మరునాడే తమిళిసై నివాసానికి అన్నామలై వెళ్లి భేటీ అయ్యారు. దీంతో వీరి మధ్య వివాదం ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.

For More National News and Telugu News..

Updated Date - Jun 14 , 2024 | 08:48 PM