Share News

Delhi : 45 కేంద్ర ప్రభుత్వ పోస్టుల్లో నేరుగా నియామకాలు

ABN , Publish Date - Aug 18 , 2024 | 03:53 AM

నేరుగా నియామకాలు (లేటరల్‌ ఎంట్రీ) విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందేందుకు యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించింది.

Delhi : 45 కేంద్ర ప్రభుత్వ పోస్టుల్లో నేరుగా నియామకాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 17: నేరుగా నియామకాలు (లేటరల్‌ ఎంట్రీ) విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందేందుకు యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించింది. కాంట్రాక్టు/డిప్యుటేషన్‌ ప్రాతిపదికన 24 శాఖల్లోని 45 పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో 10 జాయింట్‌ సెక్రటరీ, 35 డైరెక్టర్‌/డిప్యూటీ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి. ప్రయివేటు సంస్థల ఉద్యోగులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బహుళ జాతి కంపెనీలు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ అవకాశం లేదు. మూడేళ్ల కాంట్రాక్టు/డిప్యూటేషన్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

Updated Date - Aug 18 , 2024 | 03:53 AM