Share News

Bharat Jodo Nyay Yatra: రాహుల్ న్యాయ్‌ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

ABN , Publish Date - Feb 23 , 2024 | 09:43 PM

రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ఉత్తరప్రదేశ్‌ లో సాగుతోంది. కాంగ్రెస్‌ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతూ రాహుల్ గాంధీ యాత్రలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా శనివారంనాడు పాల్గోనున్నారు. మొరాదాబాద్‌ ‌లో రాహుల్‌తో ప్రియంక కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Bharat Jodo Nyay Yatra: రాహుల్ న్యాయ్‌ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra) ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో సాగుతోంది. కాంగ్రెస్‌ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతూ రాహుల్ గాంధీ యాత్రలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanaka Gandhi) శనివారంనాడు పాల్గోనున్నారు. మొరాదాబాద్‌ (Moradabad)లో రాహుల్‌తో ప్రియంక కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మొరాదాబాద్ నుంచి ఫతేపూర్ సిక్రీ వరకూ యాత్రలో ఆమె పాల్గొంటారని చెప్పాయి. రాహుల్ అమేథీ నుంచి తిరిగి పోటీ చేస్తారని, రాయబరేలి నుంచి ప్రియాంక తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో వీరిద్దరి కలయిక పార్టీ వర్గాల్లో ఉత్సాహన్ని పెంచుతోంది.


ప్రియాంక గాంధీ ఈనెల 16వ తేదీన రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనాల్సి ఉండగా అస్వస్థత కారణంగా పాల్గొనలేకపోయారు. డీహైడ్రేషన్, స్టమక్ ఇన్‌ఫెక్షన్ కారణంగా న్యూఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్ అయ్యారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల షేరింగ్ వ్యవహారం కూడా ఖరారు కావడంతో ఈనెల 25న సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం ఆగ్రాలో రాహుల్ న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.

Updated Date - Feb 23 , 2024 | 09:43 PM