Share News

KTR: ఢిల్లీ టూర్లు.. మా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడమేనా?

ABN , Publish Date - Jul 13 , 2024 | 04:42 AM

‘‘షటిల్‌ సర్వీ్‌సలాగా.. ఢిల్లీటూర్లు., మా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ.. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రజా సమస్యలపై ఏమాత్రం పట్టింపులేదు’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: ఢిల్లీ టూర్లు.. మా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడమేనా?

  • ప్రజాసమస్యలపై సీఎం రేవంత్‌కు పట్టింపులేదు

  • ఇది అసమర్థ ప్రభుత్వం: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ‘‘షటిల్‌ సర్వీ్‌సలాగా.. ఢిల్లీటూర్లు., మా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ.. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రజా సమస్యలపై ఏమాత్రం పట్టింపులేదు’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. నిర్మాణం పూర్తయిన గోపన్‌పల్లి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు కూడా సీఎంకు సమయం లేకుండా పోయిందని శుక్రవారం ఎక్స్‌ వేదికగా ఆయన విమర్శించారు.


ప్రజాసమస్యలపై అవగాహనలేని అసమర్థ ప్రభుత్వం, నాయకత్వం ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితి వస్తుందన్నారు. వెంటనే ఆ ఫ్లై ఓవర్‌ను సంబంధిత అధికారులు ప్రారంభించాలని, లేదంటే ప్రజలే దాన్ని ప్రారంభించుకునే పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్‌ హెచ్చరించారు.

Updated Date - Jul 13 , 2024 | 04:42 AM