Share News

G.Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్‌కు రూ. 22.57 కోట్లు

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:51 AM

బేగంపేట రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు కేంద్రం ప్రభుత్వం రూ.22.57 కోట్లు కేటాయించిందని కేంద్ర బొగు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

G.Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్‌కు రూ. 22.57 కోట్లు

  • కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 15(ఆంధ్రజ్యోతి): బేగంపేట రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు కేంద్రం ప్రభుత్వం రూ.22.57 కోట్లు కేటాయించిందని కేంద్ర బొగు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం, సదుపాయాలను కల్పించడంలో భాగంగా చేపట్టిన ఈ పనులు ఇప్పటికే 50శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు.


నిర్మాణంలో ఉన్న బేగంపేట రైల్వేస్టేషన్‌ చిత్రాలను ఆయన సోమవారం ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద బేగంపేట రైల్వేస్టేషన్‌ను ప్రపంచ స్థా యిలో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jul 16 , 2024 | 03:51 AM