Share News

Hyderabad: ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

ABN , Publish Date - Sep 22 , 2024 | 10:57 AM

ఈనెల 18న కూకట్‌పల్లి నుంచి విజయవాడ వెళ్లేందుకు ఓ మహిళ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కింది. రాత్రి సమయం కావడం, అందరూ నిద్రిస్తుండడంతో అదే బస్సులో ఉన్న ఓ కామాంధుడు ఆమెపై కన్నేశాడు.

Hyderabad: ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రైవేటు ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం జరగడం కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 18న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచార ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.


ఈనెల 18న కూకట్‌పల్లి నుంచి విజయవాడ వెళ్లేందుకు ఓ మహిళ(28) ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కింది. రాత్రి సమయం కావడం, అందరూ నిద్రిస్తుండడంతో అదే బస్సులో ఉన్న ఓ కామాంధుడు ఆమెపై కన్నేశాడు. మెల్లిగా ఆమె పక్కుకు చేరాడు. అరిస్తే చంపేస్తానంటూ బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. తనపై జరిగిన దారుణ ఘటనను ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె భర్తకు చెప్పింది. అనంతరం వారిద్దరూ ఇవాళ(ఆదివారం) చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. దీంతో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేసిన చౌటుప్పల్ పోలీసులు కూకట్‌పల్లికి బదిలీ చేశారు. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం బస్సులో ప్రయాణించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. నిందితుడి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.


ఏపీలో మరో ఘటన..

తిరుపతి జిల్లా అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. బెంగళూరుకు వలస కూలీగా వెళ్లిన మహిళ తన కుమార్తెను సోదరి ఇంట్లో ఉంచింది. పెద్దమ్మ ఇంట్లో ఉంటూ చిన్నారి 8వ తరగతి చదువుతోంది. అయితే పెద్దమ్మ కొడుకే ఆమెపై అత్యాచారానికి ఒడికట్టాడు. గత ఫిబ్రవరి నుంచి ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో చెప్తే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. వినాయక చవితి పండగ సందర్భంగా బాధితురాలి తల్లి బెంగళూరు నుంచి వచ్చింది. తల్లిని చూసి ఒక్కసారిగా విలపించిన చిన్నారి జరిగిన దారుణాన్ని ఆమెకు వివరించింది. పెద్దమ్మ కొడుకు ఎనిమిది నెలలుగా తనపై చేస్తున్న అఘాయిత్యాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. దీంతో ఇద్దరూ కలిసి శనివారం రాత్రి అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. అత్యాచారంపై ఫిర్యాదు చేశారు. ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - Sep 22 , 2024 | 11:20 AM