Share News

Karne Prabhakar: సచివాలయం, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తారా?

ABN , Publish Date - Feb 29 , 2024 | 02:29 PM

Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్షకోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని.. ఎక్కడ అవినీతి జరిగిందో ఆధారాలు చూపించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉపయోగం ఏంటో రేపు (శుక్రవారం) చూపిస్తామన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదన్నారు.

Karne Prabhakar: సచివాలయం, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తారా?

హైదరాబాద్, ఫిబ్రవరి 29: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో (Kaleshwaram Project) లక్షకోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ (Congress) నేతలు ఆరోపిస్తున్నారని.. ఎక్కడ అవినీతి జరిగిందో ఆధారాలు చూపించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ (Former MLC Karne Prabhakar) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉపయోగం ఏంటో రేపు (శుక్రవారం) చూపిస్తామన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మంత్రులు అంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున కట్టిన సచివాలయం, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి వేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి యాత్రలు చేయాల్సింది పోయి తమకు పోటీగా యాత్రలు చేస్తున్నారని కర్నే ప్రభాకర్ విమర్శలు గుప్పించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 29 , 2024 | 02:31 PM