Share News

High Court: మేడిగడ్డపై డ్రోన్‌ ఎగరేసిన కేసులో కేటీఆర్‌కు ఊరట

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:51 AM

మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా అనుమతి లేకుండా డ్రోన్‌ కెమెరా ఎగరేశారన్న ఆరోపణలతో మహదేవ్‌పూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

High Court: మేడిగడ్డపై డ్రోన్‌ ఎగరేసిన కేసులో కేటీఆర్‌కు ఊరట

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా అనుమతి లేకుండా డ్రోన్‌ కెమెరా ఎగరేశారన్న ఆరోపణలతో మహదేవ్‌పూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్‌లకు సయితం ఉపశమనం కలిగింది.


తమపై పెట్టిన సెక్షన్‌లకు సరిపోయే విధంగా ఆధారాలు లేవని, బ్యారేజీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో లోపాలు ఉన్నాయంటూ పిటిషనర్లు చేస్తున్న వాదనలను పరిశీలించాల్సి ఉందని జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం పేర్కొంది. అందువల్ల అరెస్టు సహా అన్ని ప్రొసీడింగ్స్‌పై స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.

Updated Date - Aug 13 , 2024 | 04:51 AM