Share News

Graduate MLC Elections: నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే.. రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతా: రాకేష్ రెడ్డి

ABN , Publish Date - May 20 , 2024 | 09:42 PM

కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పారు.

Graduate MLC  Elections: నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే.. రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతా: రాకేష్ రెడ్డి
Rakesh Reddy

ఖమ్మం జిల్లా: కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ప్రాంతాలు పోరాటాలకు, మేధావులు ఎక్కువగా ఉండే ప్రాంతాలని తెలిపారు. ఖమ్మం నగరంలోని ఎస్బీఐటీ కాలేజ్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది.

ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.


పార్టీలు ఏవైనా పట్టభద్రులు అంతా మంచి వ్యక్తులను మండలికి పంపించాలని కోరారు. మండలి అంటే పెద్దల సభ, ఇక్కడ మేధావులను ఎన్నుకుంటారే తప్పా, మోసగాళ్లను ఎన్నుకోరన్నారు.రెండు పర్యాయాల పాటు బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తే ఇంతవరకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ప్రజల తరపున పోరాడతానని.. రేవంత్ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి మంచి చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తనని తాను ప్రశ్నించే గొంతుకుగా చెప్పుకుంటారని.. ఈ 5 నెలల్లో ఏ రోజైనా ప్రశ్నించాడో విద్యావంతులు గమనించాలన్నారు.


తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని.. తెలంగాణపై ఉన్న ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. బీజేపీలో చాలా ఏళ్లు పని చేశానని, ఎన్నో పోరాటాలు చేశానని, కేసీఆర్ తనను పిలిచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు. విద్యావంతుడినైనా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తనను ఆశీర్వదించకపోతే, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని అనుకోరన్నారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో మీరంతా ఆశీర్వదిస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా మీకు సేవ చేస్తానని స్పష్టం చేశారు.తనను గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి కోసం తన వంతుగాకృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే విద్యార్థుల, ఉద్యోగుల సమస్యలపై గళం ఎత్తుతానని చెప్పారు. బ్యాలెట్లో 3 వ అంకెల్లో ఉన్న కారు గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రాకేష్ రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ కేబినెట్ భేటీ నేడు..

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు

పోలీసులను ఆట ఆడించేది జగనేనా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 09:42 PM