Delhi Elections: ఢిల్లీ బాద్షా ఎవరు.. బీజేపీ గెలిస్తే సీఎం లిస్టుల్లో ఉన్నది వీళ్లే..!
ABN , Publish Date - Feb 08 , 2025 | 09:11 AM
ఢిల్లీ బాద్షా ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇదిలావుండగా ఢిల్లీ పీఠం బీజేపీదే అంటూ ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. దీంతో బీజీపీ ఢిల్లీ నాయకులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఒకవేళ బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కౌవసం చేసుకుంటే సీఎం ఎవరవుతారనే విషయంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఢిల్లీ బాద్షా ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇదిలావుండగా ఢిల్లీ పీఠం బీజేపీదే అంటూ ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. దీంతో బీజీపీ ఢిల్లీ నాయకులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఒకవేళ బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కౌవసం చేసుకుంటే సీఎం ఎవరవుతారనే విషయంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఢిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు ఎవరు, సీఎం పదవి వరించే ఛాన్స్ ఎవరికి ఉంది.. తదితర వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు (Delhi Elections) మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. నాలుగోసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party).. మరోవైపు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈసారైనా జెండా ఎగురవేయాలని బీజేపీ (BJP) పోటీ పడుతున్నాయి. అలాగే మధ్యలో కాంగ్రెస్ పార్టీ కూడా.. పీఠం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీదే విజయం అంటూ ప్రకటించేశాయి. దీంతో బీజేపీ నాయకుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. అయితే ఢిల్లీ పీఠం బీజేపీ సొంతమైతే.. సీఎం ఎవరవుతారనే విషయంపై అంతా చర్చింకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉండగా.. ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ, రమేశ్ బిధూడీ కూడా సీఎం రేసులో ఉన్నారు. కొన్ని రోజుల కిందట ఆప్ అధినేత కేజ్రీవాల్.. ఏకంగా బీజేపీ సీఎం అభ్యర్థి రమేశ్ బిధూడీ అని తన మనసులో మాట చెప్పిన విషయం తెలిసిందే.
డిప్యూటీ సీఎంలు వీరేనా..
సాధారణంగా బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో సీఎంతో పాటూ ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించడం పరిపాటిగా వస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భాల్లో కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉదంతాలను గుర్తు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్లను సీఎంలుగా నియమించలేదని, దీన్ని బట్టి ఢిల్లీ కూడా ఇలాగే జరుగుందని చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్దేవా, ప్రవేశ్ వర్మ.. ఈ ముగ్గురిలో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మహిళనే సీఎం చేస్తారా..
ఢిల్లీలో 1993లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా సీఎంలను మార్చిన క్రమంలో 1998లో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా ఈమే అయ్యారు. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా అభ్యర్థి మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేసులోస్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి ప్రజల్లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో వీరిలో ఎవరో ఒకరు ఢిల్లీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందని చర్చించుకుంటున్నారు. మహిళను సీఎం చేయడం ద్వారా ఢిల్లీని మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని కూడా బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏ పార్టీ పాగా వేస్తుంది.. ఎవరు సీఎం అవుతారు.. అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.