Home » National
కేరళలోని పాలక్కడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు.
ఐటీ హబ్ బెంగళూరులో నీటి కష్టాలు పెరుగుతున్నాయి. ఆ నీటి పాట్లు ఇప్పుడు ముంబైకి షిప్ట్ అయ్యాయి. ముంబైలో మంగళవారం (ఈ రోజు) నీటిలో 15 శాతం కోత ఉంటుందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. థానే జిల్లాలో గల పైస్ డ్యామ్లో తగినంత నీటిమట్టం లేదని, అందుకోసమే అదనంగా నీటి కోత విధించాల్సి వస్తోందని బీఎంసీ అధికారులు తెలిపారు.
పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని కోటాలో విద్యార్థిని కిడ్నాప్ (Kidnap) కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్లోని శివపురికి చెందిన యువతి కోటాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆదివారం కోచింగ్ సెంటర్(Coaching Center)కు వెళ్లి వచ్చిన తర్వాత విద్యార్థిని ఆమె తండ్రితో ఫోన్లో మాట్లాడింది. సోమవారం తండ్రి ఫోన్కు తన కుమార్తెను కట్టిపడేసిన ఫోటోలను కిడ్నాపర్లు పంపించారు. ఆమెను విడిచిపెట్టాలంటే రూ.30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మండ్య లోక్సభ స్థానం బీజేపీ(BJP)తో పొత్తులో భాగంగా జేడీఎస్ పరం కావడంతో ఇక్కడి నుంచి కుమారస్వామి లేదా నిఖిల్కుమార్లలో ఒకరు అభ్యర్థి కానున్నారు. జేడీఎస్ పార్టీ రెండు నెలల కిందటే మండ్యనుంచి మాజీ మంత్రి పుట్టరాజు పోటీ చేసేలా సూచించింది.
మదురైలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల వాహనాలకు 5జీ సెల్ఫోన్(5G cell phone) సేవలతో పాటు, 360 డిగ్రీల కోణంలో సౌరశక్తితో పనిచేసే అధునాతన సీసీ కెమెరాలు(CC cameras) ఏర్పాటు చేశారు.
పతంజలి ఆయుర్వేదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ( Supreme Court ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార నోటీసుపై స్పందించడంలో విఫలమయ్యారంటూ ధర్మాసనం మండిపడింది.
రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవుతారని అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్(TTV Dinakaran) అభిప్రాయపడ్డారు.
చట్ట వ్యతిరేకంగా బార్లో మద్యం సీసాలు దాచిన మూడు మద్యం దుకాణాలకు ఎన్నికల ఫ్ల్లయింగ్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేశారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు నక్సలైట్లు మృత్యువాత పడ్డారని సీనియర్ అధికారి తెలిపారు.
లోక్ సభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వామ్య పక్షం రాష్ట్రీయ్ లోక్ జనశక్తి పార్టీ కూటమి నుంచి వైదొలగనుంది. ఇటీవల బీహర్ లోక్ సభసీట్లలో జరిగిన కేటాయింపులపై ఆర్ఎల్జీపీ అధినేత, కేంద్రమంత్రి పశుపతి పరాస్ గుర్రుగా ఉన్నారు. టికెట్ల విషయంలో బీజేపీ తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అంటున్నారు. సీట్ల కేటాయింపుపై బీజేపీ నాయకత్వం పునరాలోచించాలని కోరారు. బీజేపీ అధినాయకత్వం స్పందించకపోవడంతో కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు.