Home » National
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని సోమవారం దర్శించనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 14వ తేదీన వారణాసి నుంచి ప్రధాన మంత్రి నామినేషన్ వేయనుండటంతో దీనికి ముందుగానే ఆయన కాశీ విశ్వనాథుని ఆశీస్సులు తీసుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల ప్రచారం కోసం జూన్ 1వ తేదీ వరకూ మధ్యంతర బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధానిలో రెండో రోజైన ఆదివారంనాడు కూడా రోడ్షో కొనసాగించారు. తమ పార్టీకి గరిష్టంగా ఓట్లు వేస్తే 20 రోజుల తర్వాత తాను జైలుకు తిరిగి వెళ్లక్కరలేదని అన్నారు.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ల వ్యవహారంలో 'సిట్' విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న చేతన్, లిఖిత్ అనే ఇద్దరు వ్యక్తులను హసన్లో ఆదివారంనాడు అరెస్టు చేసింది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దశల వారీగా జరుగుతున్నా.. ఇప్పటికీ ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనేది క్లారిటీ రాలేదు. కొందరు బడా నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ.. కూటమి మాత్రం ఇంతవరకూ..
సామూహిక సిక్ లీవ్లో ఉన్న ఎయిర్ ఇండియా (Air India) సిబ్బంది తిరిగి విధుల్లో చేరినట్టు ఆ సంస్థ అధికారి ఒకరు ఆదివారంనాడు తెలిపారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, ఈనెల14వ తేదీ నుంచి అన్ని సర్వీసులు యథాప్రకారం నడుస్తాయని చెప్పారు.
జార్ఘాండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటంతో మంత్రి అలంగీర్కు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 14న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆయనను కోరింది.
న్యూఢిల్లీలోని బురారీ, సంజయ్ గాంధీ ఆసుపత్రులకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్ టీం ఆ యా ఆసుపత్రులకు చేరుకున్నాయి.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 గ్యారంటీలు అమలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి దివగంత హీరాబెన్ పటేల్తో మోదీ ఉన్న రెండు చిత్తరువులను అభిమానులు ఈ సందర్భంగా ఆయనకు అందజేశారు. ఐదో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నాలుగో దశ పోలింగ్కు సర్వం సిద్దమైంది. ఈ దశలో మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), బిహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్ ఒక సీటుకు పోలింగ్ జరగనుంది.