Home » 2024
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది రైతుల పరిస్థితి. బోరు బావుల్లో పుష్కలంగా నీరుంది. ప్రభుత్వం విద్యుత సరఫరా చేస్తోంది. వ్యవసాయ కనెక్షన్లు మంజూరయ్యాయి. ట్రాన్సఫార్మర్లను కూడా ఇచ్చారు. కానీ కేబుల్, కండక్టర్ల సరఫరా లేకపోవడంతో మిగిలినవన్నీ వృథా అవుతున్నాయి. పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాకు ఆరు నెలలుగా కండక్టర్, కేబుల్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత శాఖ అధికారులు రైతులకు సమాధానం ...
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విశ్రాంత అధికారి అక్రమ వ్యవహారాలకు అడ్డేలేకుండా పోయింది. కూట మి అధికారంలోకి వచ్చాక విశ్రాంత తహసీల్దార్లు ఎక్కడా పనిచేయకూడదని ఆదేశించింది. ఎక్కడైనా పనిచేస్తుంటే వెంటనే తొలగించాలని మూడు నెలల క్రితం ఆదేశించింది. దాదాపు జిల్లా అంతటా ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేశారు. కానీ భూగర్భగనుల శాఖలో మాత్రం అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో మైన్స అక్రమార్కులకు సహకరించిన ఓ ...
జమ్మూ-కశ్మీర్లో మంగళవారం చివరిదైన మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో దశలో 68.72%, మొత్తంగా(మూడు దశల్లో కలిపి) 64.45 శాతం ఓటింగ్ నమోదైంది.
అధికారం అండగా వైసీపీ నాయకులు చెలరేగిపోయారు. వాగు, వంక అన్న తేడా లేకుండా ఎర్రమట్టి కొల్లగొట్టారు. అధికారం కోల్పోయి, కూటమి ప్రభుత్వం కొలువుదీరినా మార్పు రాలేదు. ఎర్ర మట్టి మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. బుక్కరాయసముద్రం మండలంలో పట్టపగలే పచ్చని కొండలను పిండి చేస్తున్నారు. ప్రభుత్వానికి పైసా సుంకం చెల్లించడం లేదు. అనుమతులు తీసుకోలేదు. కొంత మంది టీడీపీ నాయకులు, మైనింగ్, ఇతర శాఖల అధికారులతో కుమ్మక్కై.. ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వేస్తున్నారు. ..
ప్రభుత్వ మద్యం దుకాణాల విధానానికి కూట మి ప్రభుత్వం చెక్ పెట్టింది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటి స్థానంలో ప్రైవే టు మద్యం దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం నుంచి ఈ నెల 9వతేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 11న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తారు. దక్కించుకునేవారు మరుసటి రోజు.. 12న మద్యం షాపులను ప్రా రంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 136 ప్రైవేటు మద్యం దుకాణాలకు జిల్లా...
ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించింది. అన్ని విభాగాల్లో పీఠాలు కదిలినా.. విద్యాశాఖలో మాత్రం ఏడేళ్లు దాటినా అదే సీట్లలోనే తిష్టవేశారు. ఒకే చోట పాతుకుపోయు.. అక్రమ సంపాదనకు దిగుతున్నారు. ప్రతి పనికీ ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నుంచి నెలనెలా డబ్బులు ...
తమకు తక్కువ వేతనాలు ఇస్తూ, ఎక్కువగా పనిచేయించుకుంటున్నారని, అంతేగాకుండా తమకు ఎలాంటి గౌరవం లేదని గ్రామ/వార్డు సచివాలయాల ఏఎనఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. తమను వైద్యశాఖలో కలపాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయ ఏఎనఎంలు స్థానిక కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా చేరుకుని ఆందోళన సాగించారు.
వైసీపీ పాలనలో పుట్టిన బిడ్డకు ప్రభుత్వం ఇచ్చే బేబీ కిట్స్ లేవని, ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారని ఎ మ్మెల్యే బండారు శ్రావణిశ్రీ విమర్శించారు. అదే టీడీపీ పాలనలో ప్రతి గ్రా మంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని అన్నారు. ఆమె సోమవారం శింగనమలలో సుడిగాలి పర్యటన చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పోలీస్స్టేషన, సివిల్ సప్లై గోడౌన, ఆర్టీసీ బస్టాండ్, కళాశాల ఆటస్థలం, ట్రెజరీ తహసీల్దార్ కార్యాలయం, అంగనవాడీ కేంద్రం, కెనరా బ్యాంకును పరిశీలించారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి భూ సేకరణ పనులు త్వరగా చేప ట్టాలని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదే శించారు. కలెక్టరేట్లో సోమవారం భూసేకరణపై సమీక్ష నిర్వహిం చారు.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూభవనలో నిర్వహిం చిన జిల్లా స్థాయి గ్రీవెన్సడేకి బాధితుల సందడి తగ్గింది. గతంలో జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో మాత్రమే పిర్యాదుల స్వీకరణ కొనసాగేది. అయితే కలెక్టరు ఈ సారి అనంత రెవెన్యూ డివిజన కార్యాలయం (ఆర్డీఓ)లో డివిజన ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స ఏర్పాటు చేశారు.