Home » 2024
జడ్పీ ఉద్యోగుల బదిలీలకు బహిరంగ వేలంపాటలు జరుగుతున్నాయి. ‘లచ్చ.. లచ్చన్నర... అంతకు మించి..’ అని పోటీ పడుతున్నారు. హాట్ సీటు కోసం భారీగా బేరాలకు దిగుతున్నారు. సాధారణ బదిలీలను అడ్డు పెట్టుకుని కొందరు అధికారులు, ఉద్యోగులు ఇలా పోటీ పెట్టి దండుకుంటున్నారు. జడ్పీలో ఏవో, సీనియర్ అసిస్టెంట్ సీట్లను అమ్మకానికి పెట్టారు. 22వ తేదీనే (కటాఫ్ డేట్) బదిలీల ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉన్నా.. 23వ ...
జిల్లా బధిరుల క్రీడా పోటీలు ముగిశాయి. జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన ఆఫ్ ది డెఫ్ ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం సమీపంలోని ఆర్డీటీ బధిర పాఠశాలలో సోమవారం బధిర క్రీడాకారులకు వాలీబాల్, చెస్ క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతల వివరాలను ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణ, సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు.
గతంలో మాదిరిగా అవినీ తికి పాల్పడినా, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అధికారులను హెచ్చరించారు. అనంతపు రం నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎమ్మెల్యే దగ్గుపాటి హాజరై ప్రజల నుంచి అర్జీ లు స్వీకరించారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాధ్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెనకచెర్ల గ్రా మంలో సోమవారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎంపీతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట్శివుడు యాదవ్, నియోజకవర్గ టూమెన కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ముఖ్య అధితులుగా హాజరయ్యారు
ప్రజల భూములు రక్షణ కోసమే అధికా రంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం మండలంలో పర్యటించారు. రాప్తాడు పంచాయతీ రామినేపల్లి లో రూ. 10 లక్షలతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు.
జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఆదివారం ఆయన జిల్లాకు వచ్చారు. ముందుగా హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ను సందర్శించారు. అనంతరం అనంతపురానికి వచ్చిన మంత్రి రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి జలవనరులే అత్యంత కీలకమని, ముఖ్య మంత్రి ...
పుట్టిన రోజే తనకు చివరి రోజు అవుతుందని ఆ యువకుడు ఏమాత్రం ఊహించి ఉండడు. స్నేహితులతో కలిసి చేసుకున్న బర్త్డే వేడుకలే అంత్యక్రియలకు కారణమవుతాయని అనుకుని ఉండడు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలే తమకు చివరి క్షణాలు అవుతాయని ముగ్గురు యువకులు ఊహించి ఉండరు. అందుకే బర్త్డే బాయ్తో కలిసి ఎంతో ఆనందంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మరో స్నేహితుడు వద్దు వద్దంటున్నా సతాయించి టిఫిన తినడానికని అతడి కారు తీసుకెళ్లారు. అనంతరం ఎందుకు బుద్ధి పుట్టిందో తెలియదు గానీ ...
నగరంలోని అరవింద నగర్లో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని ఆదివారం రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. పేద పిల్ల లు చదువుకునే వసతి గృహాల్లో భోజనం, ఇతర సదుపాయలు సక్రమంగా ఉండేలా చూడాలని స్బిబ్బందిని ఆదేశించారు.
ఉన్నోళ్లకే పరిమితమైన టౌన బ్యాంకును పేదలకు విరివిగా రుణాలు అందిస్తూ అర్బనబ్యాంకుగా రూపాంతరం సాధించామని బ్యాంకు చైర్మన జేఎల్ మురళీధర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సుభా్షరోడ్డులోని శ్రీకృష్ణదేవరాయభవనలో అర్బన బ్యాంకు 108వ మహాజనసభ నిర్వహించారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని చామలూరులో ఆదివారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభు త్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు హాజరయ్యారు.