Home » BJP Candidates
Andhra Pradesh Elections : విజయవాడలో బీజేపీ(BJP), జనసేన(Janasena) నేతల భేటీ ముగిసింది. గంటపాటు సాగిన ఈ సమావేశంలో.. పొత్తులో భాగంగా పార్టీలు పోటీ చేయనున్న స్థానాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఒడిస్సా ఎంపీ ఒబైజయంత్ పాండా, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు.
Lok Sabha Elections 2024: ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 370 సీట్లు లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది బీజేపీ(BJP). ఏ ఒక్క రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉంది పార్టీ అధిష్టానం. తాజాగా దక్షిది రాష్ట్రాలకు గేట్వేగా భావిస్తున్న తెలంగాణ(Telangana)పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కమలదళం. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపింది.
బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలలో వ్యూహాలపై చర్చించనున్నారు. నిన్న, మొన్న శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్ఠానం శనివారంనాడు విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు, 34 మందికి పైగా కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఈ జాబితాలో చోటుచేసుకున్నారు.
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. 195 మంది అభ్యర్థులు మొదటి లిస్ట్లో చోటుచేసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. అమిత్షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి, సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సుర స్వరాజ్ న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా నగరానికి చేరుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో ఆయన ఆటోలో ప్రయాణించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించి సంచలనంగా మారిన బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రజా సేవలోనూ తన మార్కు చూపిస్తున్నారు. తన గొప్ప మనసు చాటుకున్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ( BJP Party ) తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ ఎమ్మెల్యేలంతా రేపు (శనివారం) జరిగే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) ఉంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja Singh ) ప్రకటించారు.
ఈ లిస్ట్లో ప్రధాని మోదీ, నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప సహా పలువురు జాతీయ నేతలు ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాలను