Home » Exams
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. సుమారు 4.03లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడివడిన నీట్-2024 పరీక్ష నిర్వహణ, వెల్లడైన ఫలితాలు తీవ్ర వివాదం సృష్టిస్తున్నాయి. అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షను మళ్లీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
శాతవాహన యూనివర్సిటీ ఎల్ఎల్బీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఒక సబ్జెక్టు పేపర్లో వచ్చిన నాలుగు ప్రశ్నలు మరో సబ్జెక్టు పేపర్లోనూ వచ్చాయి.
నీట్ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో కీలకమైన స్థానికత అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఈ నెల 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన నీట్(యూజీ)-2024 ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. 720కి 720 మార్కులతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీల్లో 8 ఫస్ట్ ర్యాంకులు సాధించి నారాయణ విద్యాసంస్థలు తమ అధిపత్యాన్ని కొనసాగించాయి.
టీజీపీఎ్ససీ ఆధ్వర్యంలో జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్(Additional Collector Patil Hemanta Keshav) అన్నారు.
ఇటివల నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్ష NEET UG 2024 ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. అభ్యర్థులు exams.nta.ac.in/NEET లేదా neet.ntaonline.inని సందర్శించి నీట్ జవాబు కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కటాఫ్ అంచనా మార్కులను ఇవ్వడం జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ(Telangana)లో ఎట్టకేలకు జూన్ 9న గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్(Group 1 Prelims Exam) జరగనుంది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హాయంలో రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించగా, రెండు సార్లు పేపర్ లీక్ అయిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
గ్రూపు-1 పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.