Home » Flood Victims
ఒకవైపు గోదావరి నదికి వరదలు.. మరోవైపు భారీ వర్షాలతో కోనసీమ జిల్లాలో ప్రజా జీవనం స్తంభించిపోయింది. గోదావరి నదులు ప్రవహిస్తుండడంతో నదీ పరివాహక లంక గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఉపాధి కరువైన లంక గ్రామాల ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం కారణంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి ఎక్కువ వరదుల వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్కు వివరించానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు గవర్నర్ను కలిశారు. వరదలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడు గంటల పాటు పర్యటించారు. భారీ వర్షం పడుతున్నా.. వరద నీటిలో ఆయన పర్యటించారు. భవానీపురం, సితార సెంటర్, చిట్టి నగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు.
వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. వారం రోజులపాటు కురిసిన వర్షాలు ప్రజలకు నీడ లేకుండా చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బుడమేరు పొంగి విజయవాడ వాసులను ముంచెత్తింది. ఇళ్లలోకి పెద్దఎత్తున నీరు చేరి దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
: కొల్లేరు సరస్సులో ముంపు రోజురోజుకూ పెరుగుతూ గ్రామాలను చుట్టుముడుతోంది. ఎగువ నుండి భారీగా వరద సరస్సులోకి చేరడంతో అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు మునిగాయి.
సంవత్సరాల తరబడి రెక్కల కష్టం కళ్ల ముందే బుడమేరు లాక్కెళ్లిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయత వారిది! తామైనా ప్రాణాలతో బయటపడతామో లేదోనని బిక్కుబిక్కుమంటూ వారంరోజులుగా గడుపుతున్నారు.
వరద భాదితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 1,57,50,000 విరాళాన్ని వీఐటీ విశ్వవిద్యాలయం అందజేసింది.
విజయవాడలో వరద బాధితులకు చేయూత నిచ్చేందుకు జనసేన ఎన్ఆర్ఐ, ఆమెరికా విభాగం ముందుకొచ్చింది.
బుడమేరుకు బెజవాడ దుఃఖదాయిని అని పేరు! ఇప్పుడు ఈ వాగును విజయవాడ శివారు ప్రాంతాల వారు పగమేరు అని కూడా పిలుస్తున్నారు! వరద తగ్గినట్టే తగ్గి.. ఇళ్లు బాగు చేసుకునేలోపే మళ్లీ బుడమేరు వారితో కన్నీరు పెట్టించింది.