Home » Harish Rao
తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని.. చీము, నెత్తురు ఉంటే హరీష్ రాజీనామా ఖమ్మం జిల్లా వైరా బహిరంగసభలో ఛాలెంజ్ చేశారు. రాజీనామా చేస్తే సరే.. లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. అంతేకాదు.. ‘హరీష్రావు రాజీనామా చెయ్యి.. మళ్లీ ఎలా గెలుస్తావో చూస్తా. సిద్దిపేటలో హరీష్ను ఓడించే బాధ్యత నాది’ అని ఈ సభావేదికగా రేవంత్ మరో ఛాలెంజ్ చేశారు..
సీతారామ ప్రాజెక్ట్పై మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీశ్ రావు బోగస్ మాటలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి(CM Recanth Reddy) ఆక్షేపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్టుని మంత్రుల సమక్షంలో ఆయన ప్రారంభించారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టుకు.. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారంటూ మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలతో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు.
రాష్ట్రంలో ఐటీఐ కాలేజీలు, గురుకులాల్లో కనీస వసతుల్లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదని, వాటి పరిష్కారంపై కినుక వహిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
సీతారామ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు. ప్రచారం కోసం బటన్లు నొక్కే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపిపంచారు. ఆదివారం నాడు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 229 మందికి రూ. 56 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను హరీష్ రావు పంపిణీ చేశారు.
‘‘మేం చెబుతున్నదాంట్లో ఏది అబద్ధం? కాంగ్రెస్ 9 నెలల పాలనలో పంచాయతీలకు 9 పైసలు కూడా ఇవ్వలేదని చెప్పడమా? కేంద్రం విడుదల చేసిన నిధులు ప్రభుత్వం దారి మళ్లించడమా?’’
పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పైసాకూడా ఇవ్వలేదని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని మాజీమంత్రి హరీశ్రావు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఽసీతక్క పేర్కొన్నారు.
గత ప్రభుత్వ నిర్వాకంవల్లే గ్రామ పంచాయతీలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు వారికి లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా పడింది.