Home » Kakani Govardhan Reddy
Kakani Bail Petition: అక్రమమైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాకాణిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఇప్పటికే కాకాణికి పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారు.
Kakani Investigation News: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణకు డుమ్మా కొట్టారు. గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు మాజీ మంత్రి.
Kakani Police Notice: కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈసారి విచారణకు రాకపోతే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్ధాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులు వస్తున్నారన్న విషయం ముందుగా తెలుసుకున్న కాకాణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతనికి చెందిన రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. రెండు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకణి గోవర్దన్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు ఆదివారం నాడు వెళ్లారు. అయితే ఇంట్లో కాకణి లేకపోయే సరికి అతని కోసం అన్వేషణ చేస్తున్నారు.
Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాకాణి అక్రమ భాగోతాలు బయటకు వస్తున్నాయి.
Somireddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసునని చెప్పారు. ఎన్నికల కోడ్కు ఒక్క రోజు ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి 57.5 ఎకరాలు కొట్టేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Kakani Govardhan Reddy land scam: మాజీ మంత్రి కాకణి గోవర్థన్ రెడ్డి భారీ స్థాయిలో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితులు కోరుతున్నారు.
నెల్లూరు: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కాకాణిపై నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఇరువర్గాల వారు తీవ్రంగా గాయపడడంతో వారిని కావలి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.