Home » Mancherial
భారీ వర్షాల కారణంగా జిల్లా కేంధ్రంలోని రాళ్లవాగు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో వాగు నీరు నదిలో చేరే అవకాశం లేక పోటు కమ్ముతోంది. దీంతో లోతట్టు ప్రాం తాలైన ఎన్టీఆర్ నగర్లోని 20 ఇళ్లలోకి నీరు చేరింది. వరద బాధితులను అధికారులు ఎన్టీఆర్నగర్ సమీపంలోని భవన నిర్మాణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రానికి తరలించారు.
అన్నదాతకు సాగులో తోడుండే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను సోమవారం మండ లంలో ఘనంగా జరుపుకున్నారు. పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నాలతో బసవ న్నలకు ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. ఎడ్లతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించారు.
భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ఆ నీటిని దిగువకు వదులుతుండటంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ తీరంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్)కి వరద ముంపు ప్రమాదం నెలకొంది. దీంతో సోమవారం అధికారులు అప్రమత్తమై ఆసుపత్రిలోని గర్భిణులు, బాలిం తలను ఐబీ ప్రాంతంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు.
మంచిర్యాల నియోజకవర్గానికి ముంపు సమస్య లేదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు, డీసీపీ భాస్కర్లతో కలిసి సందర్శంచారు. కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు.
రెండు రోజు లుగా కురుస్తున్న వర్షం కారణంగా జిల్లాలో జనజీవనానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు, వంకల్లో నీరు చేరగా గోదావరి, ప్రాణహిత నదులు పొంగి పొర్లు తున్నాయి. వర్షం కొనసాగనుండటంతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజా రక్షణ చర్యలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరో రెండు రోజు లపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవ కాశం ఉన్నందున ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగ కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మంచిర్యాల నియోజకవర్గంలో నెలాఖరులోగా అభివృద్ధి కార్యక్ర మాలకు శంకుస్థాపనలు జరుగుతాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన శ్రీరాంపూర్లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. గ్రామాలు, తండాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని, వారికి ప్రభుత్వ వైద్యం అందడం లేదన్నారు.
: మంచిర్యాల కోర్టు కాంప్లెక్స్ లో శనివారం జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. సదస్సులో జూనియర్ సివిల్ జడ్జిలు ఉప నిషద్వానీ, నిరోషలు మాట్లాడుతూ మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, లైంగిక వేధింపులు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల్లో చట్టాలు కల్పిస్తున్న రక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థల గురించి వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా, నిత్యావసర ధరలను నియంత్రించా లని ఈ నెల 2న కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు ఖలిందర్ఆలీఖాన్ పేర్కొన్నారు.