Home » Ponnam Prabhakar
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలపై ఆయన జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
చివరివరకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డితో భేటీ అయ్యారు.
కరీంనగర్: స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిపామని, నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అదే విధంగా నగరంలో నిర్మించిన పలు జంక్షన్లకు కావాలనే అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసు అని వివరించారు. లండన్ అందాలని ఆగం చేశారని విరుచుకుపడ్డారు.
బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.
ప్రతి జిల్లా కేంద్రంతో పాటు 100 పడకలు ఉన్న హాస్పిటల్కు ఒక బ్లడ్బ్యాంక్ ఉండేలా కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ఎంపీలు కిషన్రెడ్డి, బండి సంజయ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.
చేప ప్రసాదానికి వచ్చిన వారితో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం పోటెత్తింది. తెలంగాణ, ఏపీతోపాటు పలురాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని దివంగత బత్తిని హరినాథ్గౌడ్ కుటుంబసభ్యులు, సోదరులు ఏటా ఉబ్బసం బాధితులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారధి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీ కాలం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో టీపీసీసీ నూతన చీఫ్ నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.