Home » Telangana BJP
సోమవారం నాడు మరోసారి బీజేపీ కేంద్ర కార్యాలయంలో హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ సమావేశమై 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల వ్యూహాలు.. 3 రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ (Rajyasabha) అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ రాష్ట్రాల నుంచి ఒక తెలుగు నేతకు...
తెలుగు రాష్ట్రాల బీజేపీ మాజీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay), సీనియర్ నేత సోమువీర్రాజులను (Somu Veerraju) కీలక పదవులు వరించాయి..
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పట్టు పెంచుకొని అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇందుకోసం ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశం మలుచుకుని ముందుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డాలు (JP Nadda) వరుస పర్యటనలు, బహిరంగ సభలతో బిజిబిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణలో (Telangana) , వచ్చే ఏడాది ఏపీలో (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇదే అదనుగా భావించిన బీజేపీ పెద్దలు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిని రాజ్యసభకు తీసుకోవాలని..
అవును.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో (Modi Telangana Tour) కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొచ్చాయి..! వరంగల్లోని హన్మకొండ వేదికగా బీజేపీ భారీ బహిరంగ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు ప్రధానితో పాటు పలువురు కేంద్ర ముఖ్యనేతలు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy), ఎంపీ బండి సంజయ్తో (MP Bandi Sanjay) పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన తెలంగాణ బీజేపీలో అసంతృప్తికి తెరతీసింది.
బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ’ టీమ్..(BJP-BRS) ఈ మాట గత నెలన్నర రోజులుగా ఎక్కడ చూసినా వినిపిస్తోంది.. మీడియాలో, సోషల్ మీడియాలో.. ప్రతిపక్షాల నోట ఇదే మాట. సీన్ కట్ చేస్తే అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీ ఒకరిపై ఒకరు ప్రేమను ఒలకబోసుకోవడం.. మునుపటిలాగా విమర్శలు, ప్రతివిమర్శలు లేకపోవడం.. ఒకవేళ ఉన్నా తగిలీ తగలక ఉండటంతో ఏదో తేడాగానే ఉందే అని అందరూ అనుకుంటున్నారు..
అవును.. బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను (Bandi Sanjay) తప్పించిన మరుక్షణం నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.! ఎందుకంటే.. ఎక్కడో ఉన్న బీజేపీ (TS BJP) బీఆర్ఎస్తో (BRS) ఢీ అంటే ఢీ అనే స్థాయికి వచ్చిదంటే ఇందుకు కర్త, కర్మ, క్రియ బండి సంజయ్.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజమే.!..
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్కుమార్ తప్పుకున్నా ఆయనపై పాతతరం బీజేపీ నేతలు అసమ్మతి రాగాలను వినిపిస్తూనే ఉన్నారు. అధ్యక్ష పదవి నుంచి ఆయన దిగిపోయినా ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాలను తాము అనుభవిస్తూనే ఉన్నామని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందంటూ అసమ్మతి నేతలు కొత్త నాయకత్వాన్ని కోరడానికి సిద్ధమవుతున్నారు.
అవును.. ఒకే ఒక్క పదవి.. సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్లో (Etela Rajender) ఎనలేని ఉత్సాహాన్ని తెప్పించింది..! ఇన్నిరోజులు పదవి లేదని అసంతృప్తితో నియోజకవర్గానికే పరిమితమైన రాజేందర్ ఇప్పుడు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్పై (CM KCR) ‘ఈట’లను దింపేందుకు రెడీ అయిపోయారు..!
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ను కేంద్ర మంత్రి పదవి వరించేది, లేనిది తేలడానికి మరో వారం పట్టే అవకాశం ఉన్నది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రాజధానిలో లేకపోవడం, ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనకు తెలంగాణకు రానున్న నేపథ్యం కారణంగా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఆలస్యం కానున్నది.