LokeshYuvaGalam: లోకేష్‌కు సమస్యలు మొరపెట్టుకున్న మోదుగులపాలెం ప్రజలు

ABN , First Publish Date - 2023-02-22T11:40:12+05:30 IST

చిత్తూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది.

LokeshYuvaGalam: లోకేష్‌కు సమస్యలు మొరపెట్టుకున్న మోదుగులపాలెం ప్రజలు

తిరుపతి: చిత్తూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (TDP Leader Nara Lokesh YuvaGalam Padayatra) విజయవంతంగా సాగుతోంది. బుధవారం 24వ రోజు లోకేష్ పాదయాత్ర (YuvaGalam)ను ప్రారంభించారు. కోబాక నుంచి లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)ను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మోదుగులపాలెం ప్రజలు లోకేష్‌ (Nara lokesh)కు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ (TDP)కి చెందిన వారమని పింఛన్లు రద్దు చేశారని పలువురు మహిళలు... లోకేష్ (YuvaGalamPadayatra) దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ జెండాలు (TDP Flags) కడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కూడా గ్రామంలో వాలంటీరు ఈ పాదయాత్రకు వెళ్లకూడదని అందరికీ చెబుతున్నారని... వెళ్లిన వారికి పథకాలు రావని బెదిరిస్తున్నారని మహిళలు వాపోయారు.

దీనిపై లోకేష్ స్పందిస్తూ.. ‘‘మీరు ఎవరికీ భయపడవద్దు.. మీకు అండగా నేనున్నా’’ అంటూ భరోసా ఇచ్చారు. తనను కూడా పాదయాత్ర చేయకుండా ఉండడానికి అడ్డుకట్టలు వేశారని.. తానేమైనా తీవ్రవాదినా అని నిలదీశానని.. బెదిరిస్తే తిరుగుబాటు తప్పదని తెలిపారు. వచ్చేది బాబు.. జగన్ పని అయిపోయిందన్నారు. అర్హులైన అందరికీ రాజకీయాలకు అతీతంగా పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని లోకేష్ (LokeshYuvaGalam) పేర్కొన్నారు.

Updated Date - 2023-02-22T11:40:13+05:30 IST