Muppalla Nageswara Rao: ఆర్థిక ఉగ్రవాదిలా జగన్ పాలన చేస్తున్నాడు

ABN , First Publish Date - 2023-10-12T14:59:10+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) కాళ్లు మొక్కుతూ ఆర్థిక ఉగ్రవాదిలా జగన్(JAGAN) పాలన చేస్తున్నాడని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు(Muppalla Nageswara Rao) అన్నారు.

Muppalla Nageswara Rao: ఆర్థిక ఉగ్రవాదిలా జగన్ పాలన చేస్తున్నాడు

గుంటూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) కాళ్లు మొక్కుతూ ఆర్థిక ఉగ్రవాదిలా జగన్(JAGAN) పాలన చేస్తున్నాడని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు(Muppalla Nageswara Rao) అన్నారు. సీపీఐ కార్యాలయంలో గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మీడియాతో మాట్లాడుతూ..‘‘వైసీపీ ప్రభుత్వం ఏపిని అప్పుల కుప్పగా మార్చింది. ఇప్పటికి 67 వేల కోట్లు అప్పు తెచ్చారు. కేంద్రం జగన్‌రెడ్డిని గుండెల్లో పెట్టుకోని కాపాడుతోంది. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్‌లపై తప్పుడు కేసులు పెట్టి జగన్‌రెడ్డి పొలిటికల్ టెర్రరిజం నడుపుతున్నాడు. వలంటీర్ వ్యవస్థను రాజకీయ కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. కృష్ణ జలాల విషయంలో నోరు మెదపలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ నేతలు పురంధరేశ్వరి, జీవిఎల్‌ కూడా కృష్ణ జలాలపై నోరు ఎత్తడం లేదు. మోదీ, జగన్, కేసీఆర్ కలసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు’’ అని ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు.

Updated Date - 2023-10-12T14:59:10+05:30 IST