Challababu: పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ నేత చల్లాబాబుకు బెయిల్ మంజూరు

ABN , First Publish Date - 2023-10-06T15:45:18+05:30 IST

పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ నేత చల్లాబాబు( Challababu)కు ఏపీ హైకోర్టు బెయిల్(AP High Court Bail) మంజూరు చేసింది. 45 వేల షూరిటీ బాండ్లు సమర్పించాలని ఆదేశించింది

Challababu: పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ నేత చల్లాబాబుకు బెయిల్ మంజూరు

అమరావతి: పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ నేత చల్లాబాబు( Challababu)కు ఏపీ హైకోర్టు బెయిల్(AP High Court Bail) మంజూరు చేసింది. 45 వేల షూరిటీ బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణలల్లో చల్లాబాబుపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే నాలుగు కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. మిగతా మూడు కేసుల్లో చల్లా బాబు లొంగిపోయారు. చల్లాబాబు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. చల్లా బాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటీషన్ వేశారు. చల్లాబాబు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, అనుమోలు జ్యోతిరత్న వాదనలు వినిపించారు.

Updated Date - 2023-10-06T15:45:18+05:30 IST