Share News

Shocking: ఓ ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన.. లోపలి నుంచి తాళం పెట్టి ఉందని గుర్తించిన స్థానికులు.. పోలీసులు తలుపులను పగలగొట్టి చూస్తే..!

ABN , First Publish Date - 2023-10-18T20:33:38+05:30 IST

విధి.. ఆ తల్లికి 84 వయసులో కడుపుకోత మిగిల్చింది. ఒక్కాగానొక్క కూతురు ఆసరాగా ఉందనే ధైర్యంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆమె ఆశలు అంతలోనే అడియాశలవుతాయని ఎవరూ ఊహించలేదు. అనుకోకుండా అనారోగ్యానికి గురైన కూతురు కళ్ల ముందే చనిపోయినా...

Shocking: ఓ ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన.. లోపలి నుంచి తాళం పెట్టి ఉందని గుర్తించిన స్థానికులు.. పోలీసులు తలుపులను పగలగొట్టి చూస్తే..!
ప్రతీకాత్మక చిత్రం

విధి.. ఆ తల్లికి 84 వయసులో కడుపుకోత మిగిల్చింది. ఒక్కాగానొక్క కూతురు ఆసరాగా ఉందనే ధైర్యంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆమె ఆశలు అంతలోనే అడియాశలవుతాయని ఎవరూ ఊహించలేదు. అనుకోకుండా అనారోగ్యానికి గురైన కూతురు కళ్ల ముందే చనిపోయినా ఏమీ చేయలేని నిస్సహాయస్థితి. కుళ్లిపోతున్న స్థితిలో ఉన్న కూతురు మృతదేహం ఎదురుగా కనిపిస్తున్నా గుర్తించలేకపోని పరిస్థితి. చివరకు పోలీసులకు తలుపులు పగలగొట్టి చూడగా.. విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

చెన్నై మనాలిలో (Chennai) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక న్యూటౌన్ పరిధిలో షీలా (55) అనే మహిళ తన 84ఏళ్ల తల్లి జాస్మిన్‌తో కలిసి నివాసం ఉంటోంది. కొన్నేళ్లుగా షీలా మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఎక్కడికీ వెళ్లకుండా ఇంటికే పరిమితమైంది. షీలా తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోవడంతో ప్రస్తుతం తల్లీకూతుళ్లు మాత్రమే ఉంటున్నారు. ఇటీవల షీలా తీవ్ర మానసిక ఒత్తిడికి (mental stress) గరవుతూ రావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ క్రమంలో ఆమె ఉన్నట్టుండి మృతి (woman died) చెందింది. అయితే వృద్ధురాలైన తల్లికి ఈ విషయం అర్థం కాలేదు. తలుపులు వేసుకుని ఇంట్లో తన పనిలో తాను పడిపోయింది.

Crime: 2 ఏళ్ల బాలిక మిస్సింగ్.. అదే అపార్ట్మెంట్‌లో అత్త ఇంట్లో సోఫా కింద దొరికిన మృతదేహం.. ఏం చేశావని ఆమెను నిలదీస్తే..!

మూడు రోజుల పాటు వృద్ధురాలు తన కూతురు మృతదేహంతో కలిసి జీవించింది. ఈ క్రమంలో మంగళవారం ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. తలుపులు కొట్టి చూసినా ఎవరూ తీయకపోవడంతో మనాలి న్యూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఎలాగోలా తలుపులు తీసి లోపలికి వెళ్లారు. అప్పటికే షీలా మృతదేహం ఉబ్బిపోయి ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. కూతురు మృతిపై తల్లిని ప్రశ్నించగా.. తనకేమీ తెలీదని, ఆమె పడుకుని ఉందని అనుకున్నట్లు చెప్పింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షీలా అనారోగ్య కారణంగానే చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్తున్న బస్సు.. ఇంజిన్ ముందు వైపు చూస్తే అవాక్కవడం ఖాయం..

Updated Date - 2023-10-18T20:33:38+05:30 IST