Woman: ఊరి చివర ఓ మహిళ మృతదేహం.. తల లేదు.. చేతి వేళ్లు కూడా కట్.. అసలు ఎవరు చేశారో తెలిసి పోలీసులకూ షాక్..!

ABN , First Publish Date - 2023-09-30T18:35:52+05:30 IST

కొన్నిసార్లు అనుమానమే పెనుభూతమై చివరకు మనిషి ప్రాణాలనే బలికొంటుంది. చాలా మంది తమ అనుమానాలను నివృత్తి చేసుకోకుండానే కక్ష పెంచుకుంటారు. ఈ క్రమంలో చివరకు దారుణాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి..

Woman: ఊరి చివర ఓ మహిళ మృతదేహం.. తల లేదు.. చేతి వేళ్లు కూడా కట్.. అసలు ఎవరు చేశారో తెలిసి పోలీసులకూ షాక్..!
ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు అనుమానమే పెనుభూతమై చివరకు మనిషి ప్రాణాలనే బలికొంటుంది. చాలా మంది తమ అనుమానాలను నివృత్తి చేసుకోకుండానే కక్ష పెంచుకుంటారు. ఈ క్రమంలో చివరకు దారుణాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా ఘటనే జరిగింది. ఊరి చివర నిర్మానుష్య ప్రదేశంలో ఓ మహిళ మృతదేహం పడి ఉంది. తల వేరు చేయడంతో పాటూ చేతి వేళ్లూ కట్ చేసి ఉన్నాయి. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బాందా జిల్లా చమ్రహ గ్రామ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఛతర్‌పూర్ జిల్లా పహ్రా గ్రామానికి చెందిన రామ్‌కుమార్ అహిర్వార్ అనే వ్యక్తి.. 35 ఏళ్ల మాయాదేవి అనే మహిళను (woman) కొన్నేళ్ల కిందట రెండో వివాహం చేసుకున్నాడు. అయితే అప్పటికే రామ్‌కుమార్‌కు పెళ్లీడుకొచ్చిన సూరజ్ ప్రకాష్, బ్రిజేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇటీవల రామ్‌కుమార్, మాయాదేవి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన కొడుకుల్లో ఒకరితో మాయాదేవి వివాహేతర సంబంధాన్ని (extramarital affair) కొనసాగిస్తోందని రామ్‌కుమార్ అనుమానం పెంచుకున్నాడు.

Amazon Sale: వాటిపై ఏకంగా 75 శాతం డిస్కౌంట్.. అమెజాన్ సేల్‌లో ఏఏ వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయంటే..!

ఒకరి తర్వాత మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని కోపం పెంచుకున్నాడు. ఇటీవల తన రెండో కొడుకుతో కూడా మాయాదేవి చనువుగా ఉండడం చూసి అతడి అనుమానం మరింత బలపడింది. అప్పటినుంచి రోజూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో చివరకు మాయాదేవిని అంతమొందిచాలని రామ్‌కుమార్, అతడి కుమారులు కుట్ర పన్నారు. శుక్రవారం రామ్‌కుమార్ తన కొడుకులతో పాటూ తన మేనల్లుడు ఉదయబన్‌తో కలిసి మాయాదేవిని జీపులో ఎక్కించుకుని.. ఉత్తరప్రదేశ్ పరిధి చమ్రహ గ్రామ పరిధిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. అంతటితో ఆగకుండా ఆమె తల వేరు చేయడంతో పాటూ వేళ్లు కూడా కత్తిరించారు. పోలీసుల విచారణలో రామ్‌కుమార్ నేరం అంగీకరించడంతో నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Police: ఓ ఇంట్లోకి అదే పనిగా ఎక్కువ మంది వస్తూ ఉండటంపై స్థానికులకు డౌట్.. విషయం తెలిసి పోలీసులు సడన్‌గా సెర్చ్ చేస్తే..!

Updated Date - 2023-09-30T18:42:45+05:30 IST