Share News

AP News: తూర్పు గోదావరి జిల్లాలో ప్రబలిన డయేరియా.. మంత్రి పవన్ కళ్యాణ్ ఆరా

ABN , Publish Date - Jun 22 , 2024 | 04:54 PM

తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా ప్రబలింది. ఒకరి మృతి, 25మంది చికిత్స పొందుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) మంత్రి వాసంశెట్టి సుభాష్ వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కాకినాడ కలెక్టర్‌కు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పారు.

 AP News: తూర్పు గోదావరి జిల్లాలో ప్రబలిన డయేరియా.. మంత్రి పవన్ కళ్యాణ్ ఆరా
Minister Pawan Kalyan

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా ప్రబలింది. ఒకరి మృతి, 25మంది చికిత్స పొందుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan) మంత్రి వాసంశెట్టి సుభాష్ వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కాకినాడ కలెక్టర్‌కు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పారు. గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని మంత్రులు కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ నుంచే కాకినాడ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి సుభాష్ మాట్లాడారు.

Updated Date - Jun 22 , 2024 | 04:54 PM