Share News

AP Exit Polls: ఓడిపోయే ప్రముఖులు వీళ్లే.. ఆరా సర్వేలో సంచలనం..!

ABN , Publish Date - Jun 01 , 2024 | 10:00 PM

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై వివిధ సర్వే సంస్థలు విభిన్న అంచనాలను వేసింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి.

AP Exit Polls: ఓడిపోయే ప్రముఖులు వీళ్లే.. ఆరా సర్వేలో సంచలనం..!
YSRCP Leaders

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై వివిధ సర్వే సంస్థలు విభిన్న అంచనాలను వేసింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. ప్రముఖులు పోటీచేసిన స్థానాలపై ఆరా తన అంచనాలను వెల్లడించింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్లలో ఎక్కువమంది ఓడిపోయే అవకాశం ఉందని ఆరా పేర్కొంది. అదే సమయంలో కొందరు మంత్రులు గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సంస్థ అధినేత మస్తాన్ తెలిపారు.

AP Exit Polls 2024: ఏపీలో గెలుపెవరిదో చెప్పేసిన ఆరా మస్తాన్..


AARA Exit Polls: అనకాపల్లి, నరసాపురంలో గెలుపు వారిదే.. రాజంపేటలో మాత్రం..


Kutami Logo.jpg

ఓడిపోయేది ఎవరు..

ఆరా సంస్థ అంచనా ప్రకారం పలాసలో వైసీపీ అభ్యర్థి మంత్రి సీదిరి అప్పలరాజు ఓడిపోతారని.. టీడీపీ అభ్యర్థి గౌతు శిరష గెలిచే అవకాశం ఉనట్నలు తెలిపింది. గాజువాక నుంచి వైసీపీ అభ్యర్థి ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ ఓడిపోతారని ఓడిపోతారని టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గెలుస్తారని పేర్కొంది. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శ్రీనివాస్ ఓడిపోతారని.. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి గెలుస్తారని అంచనా వేసింది. తణుకు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు ఓడిపోతారని.. టీడీపీ అభ్యర్థి ఎ రాధాకృష్ణ గెలుస్తారని ఆరా అంచనా వేసింది. తాడేపల్లిగూడెం నుంచి వైసీపీ అభ్యర్థి మంత్రి కొట్టు సత్యనారాయణ ఓడిపోతారని జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గెలుస్తారని పేర్కొంది. కొండెపి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ ఓడిపోతారని.. ఇక్కడ టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయ స్వామి గెలుస్తారని ఆరా అంచనా వేసింది. కొండెపిలో డోలా బాలవీరాంజనేయస్వామి గెలిస్తే వరుసగా మూడుసార్లు గెలిచినట్లవుతుంది.


YCP Leaders.jpg

గెలిచేది ఎవరంటే..

ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని ఆరా సంస్థ అంచనా వేసింది. సాలూరు అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్థి రాజన్నదొర గెలుస్తారని టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఓడిపోతారని తెలిపింది. తుని నుంచి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ఓడిపోయే అవకాశం ఉందని.. వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మరోసారి గెలిచే అవకాశం ఉందని ఆరా వెల్లడించింది.


AP Exit Polls 2024: ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 10:47 PM