Share News

CM Chandrababu: రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు చంద్రబాబు

ABN , Publish Date - Jun 16 , 2024 | 06:01 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) రేపు(సోమవారం) పోలవరం పర్యటన ఖరారయింది. రేపు ఉదయం 11.45 గంటలకు పోలవరం రానున్నారు.

CM Chandrababu: రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు చంద్రబాబు
CM Nara Chandrababu Naidu

ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) రేపు(సోమవారం) పోలవరం పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 11.45 గంటలకు పోలవరానికి చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు పోలవరం ప్రాజెక్టులో వివిధ భాగాలను సీఎం సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్షిస్తారు.


మధ్యాహ్నం 3.10 గంటలకు మీడియా సమావేశం ఉంటుంది. సాయంత్రం నాలుగు గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి చంద్రబాబు బయలుదేరనున్నారు.సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను మంత్రి రామానాయుడు ఆరా తీశారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Politics: నారా లోకేష్‌‌‌ను కలిసిన మాజీ మంత్రి బాధితులు

Pithani Satyanarayana: ప్రతిపక్షాన్ని గౌరవించే ప్రభుత్వం మాది

Amaravati: ఆదివారమైనా తగ్గేదే లే.. లోకేష్ తీరుపై ప్రజల హర్షం..

YS Sharmila: ఫాదర్స్ డే సందర్భంగా షర్మిల భావోద్వేగ పోస్ట్..

Kodali Nani: చంద్రబాబు కాళ్ల వద్ద కొడాలి నాని.. గుంటూరులో ఫ్లెక్సీ..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 16 , 2024 | 06:13 PM